కొవిడ్ టీకా: ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుందంటే..!
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో ఇమ్యూనిటీ పెరగడానికి ఎన్నిరోజుల సమయం పడుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ను ఎదుర్కొనే వ్యాక్సిన్లు అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఫైజర్ టీకా తీసుకున్న పదిరోజులకు ఓ అమెరికన్ నర్సుకు కరోనా పాజిటివ్గా తేలింది. తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న మరికొందరిలోనూ వైరస్ బయటపడినట్లు అమెరికా వైద్యులు గుర్తించారు. ఈ ఘటనలతో కొందరిలో ఆందోళన వ్యక్తమైంది. అయితే, ఇలాంటి కేసులు సహజమేనని.. ఇది ఊహించినదేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో రోగనిరోధకత(ఇమ్యూనిటీ) పెరగడానికి ఎన్నిరోజుల సమయం పడుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే వైరస్ నుంచి రక్షణ కలుగుతుందనే భావన కొందరిలో ఉంది. అయితే, కరోనా వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నాక శరీరంలో దాని ప్రభావం చూపేందుకు పది నుంచి 14రోజుల సమయం పడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అప్పుడు కూడా కేవలం 50శాతానికి పైగా మాత్రమే రోగనిరోధకత వస్తుందని..రెండో డోసు తీసుకున్న తర్వాతే పూర్తి రోగనిరోధకత వస్తుందని స్పష్టంచేస్తున్నారు. శరీరంలోకి ప్రవేశించిన కొవిడ్కు కారణమయ్యే వైరస్ను గుర్తించి రోగ నిరోధక శక్తిని సంసిద్ధం చేయడంలో తొలి డోసు ఉపయోగపడుతుందని.. ఇక వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాకుండా ఆ రోగనిరోధక శక్తిని మరికొన్ని నెలల పాటు కొనసాగించడం రెండో డోసు తర్వాతే లభిస్తుందని అంటున్నారు. కాలిఫోర్నియా నర్సు విషయంలో మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న రోజు లేదా మరుసటి రోజు వైరస్ సోకి ఉంటుందని.. అందుకే టీకా తీసుకున్న ఆరు రోజుల్లోనే లక్షణాలు బయటపడినట్లు నిపుణులు భావిస్తున్నారు. వ్యాక్సిన్ తన పని చేసేందుకు కావాల్సిన సమయం లభించకపోవడం వల్లే అలాంటి ఘటనలు జరుగుతాయని వివరిస్తున్నారు.
వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయంటే..!
కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు శరీరంలో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడంలో వ్యాక్సిన్లు దోహదం చేస్తాయనే విషయం తెలిసిందే. అయితే, వివిధ వ్యాక్సిన్లు వేర్వేరు పనితీరును చూపించినప్పటికీ అన్ని టీకాల లక్ష్యం మాత్రం ఒక్కటే. శరీరంలో వైరస్ ప్రవేశించినప్పుడు వాటిని గుర్తించి మెమొరీ కణాలుగా పిలిచే టీ-లింఫోసైట్స్, బీ-లింఫోసైట్లను సరఫరా చేయడమే వాటి కర్తవ్యం. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నాక ఈ కణాలను ఉత్పత్తి చేసేందుకు కొన్ని వారాల సమయం పడుతుంది. వ్యాక్సిన్ నుంచి రక్షణ పొందేందుకు సాధారణంగా 10 నుంచి 14 రోజుల సమయం పడుతుందని అమెరికా సీడీసీ నిపుణులు క్రిష్టియన్ రామర్స్ స్పష్టంచేశారు. అందుకే వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఒక్కోసారి వైరస్ లక్షణాలు బయటపడుతాయని పేర్కొన్నారు. ఇక మరికొన్ని సార్లు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగనిరోధకత పెరుగుతున్న సమయంలోనూ జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరం రోగనిరోధకతను వృద్ధి చేసుకుంటోందనడానికి గుర్తుగా ఆ లక్షణాలను భావించాలని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇదిలా ఉంటే, వ్యాక్సిన్ ప్రయోగాల్లో భాగంగా, తొలి డోసు తీసుకున్న తర్వాత ఇస్ట్రాజెనెకా-70శాతం, ఫైజర్-82శాతం, మోడెర్నా-92శాతం సమర్థత చూపించినట్లు వెల్లడించాయి. రెండో డోసు తీసుకున్నాక దాదాపు 95శాతం సమర్థత చూపించాయని ప్రకటించాయి. ఇక తీవ్ర కేసుల్లో మాత్రం వందశాతం రక్షణ కల్పిస్తాయని ఆయా సంస్థలు మధ్యంతర విశ్లేషణ ఫలితాల్లో వెల్లడించాయి. అందుకే వ్యాక్సిన్ తీసుకునేవారు కచ్చితంగా రెండు డోసులను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి..
వ్యాక్సిన్... అలా మొదలైంది..!
వైరస్ సోకిన వారూ టీకా తీసుకోవాలి..!
కరోనా టీకా: ఇవి తెలియాలి మరి!
కరోనా టీకా తీసుకున్నాక ఎలా ఉంటుందంటే?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
PM Modi: బస్టాండ్లో పండ్లు విక్రయించుకుంటూ జీవనం గడిపే ఓ మహిళను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారు. ఇంతకీ ఎవరామె..? -
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
సీఏ పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం (Supreme Court).. పిల్ను విచారించేందుకు నిరాకరించింది. -
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. -
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు