500 రాకెట్లను తట్టుకొన్న ఉక్కుగొడుగు అది..!
ప్రతి మూడు నిమిషాలకో రాకెట్ గర్జనతో ఇజ్రాయెల్ దద్దరిల్లిపోయింది. అయినా కానీ, అతిస్వల్ప నష్టంతో బయటపడింది.
ఐరన్డోమ్ లేకపోతే భారీ నష్టమే
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ప్రతి మూడు నిమిషాలకో రాకెట్ గర్జనతో ఇజ్రాయెల్ దద్దరిల్లిపోయింది. అయినా కానీ, అతిస్వల్ప నష్టంతో బయటపడింది. ప్రత్యర్థులపై దాడులు నిర్వహించింది. కేవలం ఒక రక్షణ వ్యవస్థే ఇజ్రాయెల్ను కాపాడిందని చెప్పాలి. అదే ‘ఐరన్డోమ్’ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. పదేళ్ల క్రితం సేవలు అందించడం ప్రారంభించిన ఈ వ్యవస్థ ఇప్పటి వరకు వేల కొద్దీ రాకెట్లను గాల్లోనే ధ్వంసం చేసింది. ఒక రకంగా గతం పరిశీలిస్తే.. ఐరన్డోమ్ వచ్చాక.. రాక ముందు అన్నంత మార్పు కనిపిస్తుంది. తాజాగా ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకోవడంతో మరోసారి ఈ గగనతల రక్షణ వ్యవస్థ వార్తలో కేంద్రబిందువుగా నిలిచింది.
ఏమిటీ ఐరన్ డోమ్..?
సాధారణంగా సమీప దూరాల్లోని ప్రత్యర్థుల స్థావరాలను ధ్వంసం చేయడానికి స్వల్ప శ్రేణి రాకెట్లు, శతఘ్నులు, మోర్టార్లను వినియోగిస్తుంటారు. దూరం తక్కువ ఉండటంతో ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి శత్రువులకు తగినంత సమయం లభించదు. అటువంటి ముప్పులను ముందుగానే గమనించి గాల్లోనే ధ్వంసంచేసే వ్యవస్థను ఇజ్రాయిల్కు చెందిన రఫేల్ డిఫెన్స్ సిస్టమ్స్ అమెరికా ఆర్థిక సహకారంతో దశాబ్దం క్రితం అభివృద్ధి చేసింది. దానిని ఐరన్డోమ్గా వ్యవహరిస్తుంది. 2011లో వినియోగంలోకి తీసుకొచ్చింది. గాజాపట్టీ వైపు నుంచి ఉగ్రవాదులు ప్రయోగించే రాకెట్లు, శతఘ్ని గుండ్లను ఇది ఎదుర్కొంటుంది. దీని రేంజి 70 కిలోమీటర్ల వరకు ఉంది. ఇది కాకుండా ఇజ్రాయెల్ వద్ద ‘డేవిడ్స్లింగ్’,‘యారో’ అనే రెండు వ్యవస్థలు ఉన్నాయి. ఇవి దీర్ఘశ్రేణి క్షిపణుల వంటి వాటిని ఎదుర్కొంటాయి.
ఎలా పనిచేస్తుంది..?
ఈ వ్యవస్థ మొత్తంలో రాడార్లు,సాఫ్ట్వేర్,రాకెట్ ప్రయోగించే బ్యాటరీలు ఉంటాయి. గాజాపట్టీలో రాకెట్ ప్రయోగించిన వెంటనే రాడార్ పసిగట్టి.. దాని గమనాన్ని సాఫ్ట్వేర్ వ్యవస్థకు పంపిస్తుంది. వచ్చే రాకెట్ ఏ ప్రదేశంలో పడుతుందో గుర్తిస్తుంది. ఆ ప్రదేశం ఖాళీగా ఉంటే రాకెట్ను ప్రయోగించదు. అదే వ్యూహాత్మక ప్రాంతంలో, జనావాసాలపై పడే అవకాశం ఉంటే మాత్రం బ్యాటరీ నుంచి రాకెట్ను ప్రయోగిస్తుంది. ఐరన్ డోమ్ నుంచి వెలువడిన టమిర్ క్షిపణి ప్రత్యర్థుల రాకెట్ను గాల్లోనే పేల్చివేస్తుంది.
ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతూ..
2011లో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ కీలక విభాగాలను ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తోంది. హార్డ్వేర్లో పెద్దగా మార్పులు చేయకపోయినా.. ముప్పును విశ్లేషించే సాఫ్ట్వేర్ను మాత్రం బాగా అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఐరెన్ డోమ్ క్షిపణులు, డ్రోన్లు ఇతర ముప్పులను కూడా సమర్థంగా ఎదుర్కోగలదని ఇజ్రాయెల్ రక్షణ శాఖలోని ఓ విభాగానికి డైరెక్టర్ అయిన మోషెపటేల్ పేర్కొన్నారు.
ఎంతవరకు విజయవంతమైంది..?
ఇజ్రాయెల్ సరిహద్దుల్లో దీనిని అమర్చిన నాటి నుంచి వేల సంఖ్యలో హమాస్ రాకెట్లను కూల్చేసిందని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. ఈ గగనతల రక్షణ వ్యవస్థ 90శాతం విజయవంతగా రాకెట్లను కూల్చేసినట్లు వెల్లడించారు. కాకపోతే విమర్శకులు మాత్రం ఈ లెక్కలపై సందేహాలు వెలిబుచ్చుతున్నారు. గాజా వైపు ఉన్న హమాస్ మిలిటెంట్లు కూడా ఈ వ్యవస్థ పనితీరును అర్థం చేసుకొని.. మార్పులు చేసుకొంటున్నారన్నారు. ‘ఏ క్షిపణి రక్షణ వ్యవస్థ పూర్తిగా నమ్మదగినది కాదు’ అని బ్రూక్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మిషెల్ ఆర్మ్స్ట్రాంగ్ పేర్కొన్నారు. ఆయన గత కొన్నేళ్లుగా ఈ వ్యవస్థల పనితీరు పై అధ్యయనం చేస్తున్నారు.
ఖర్చు కూడా తక్కువ..
ఈ వ్యవస్థ రాక ముందు గాజాపట్టీ వైపు నుంచి దాడులు జరిగితే అక్కడకు ఇజ్రాయెల్ సైన్యాన్ని పంపించాల్సి వచ్చేది. అప్పుడు మరిన్ని ఘర్షణలు జరిగి ఇరు పక్షాలవైపు ప్రాణనష్టం ఎక్కువగానే ఉండేది. కానీ, ఈ వ్యవస్థ వచ్చాక దళాలు అక్కడకు వెళ్లాల్సిన అవసరంలేదు. ఈ వ్యవస్థలోని అప్రమత్తం చేసే సైరన్ విని ప్రజలు సురక్షిత స్థానాలకు తరలివెళుతున్నారు. అమెరికా రక్షణ శాఖ కూడా ఇజ్రాయెల్ నుంచి ఈ వ్యవస్థలను కొనుగోలు చేసి వినియోగిస్తోంది. ఇక గాల్లో వచ్చే క్షిపణులను ఢీకొనాలంటే గగనతల రక్షణ వ్యవస్థలకు క్షిపణుల రూపంలో భారీగా ఖర్చవుతుంది. కానీ, ఐరన్ డోమ్ మాత్రం ఆ ఖర్చును తప్పించింది. ప్రత్యర్థి శిబిరం నుంచి వచ్చే రాకెట్, శతఘ్నిగుండు జనావాసాలకు దూరంగా పడుతుందని అంచనా వేస్తే ఎటువంటి క్షిపణిని ప్రయోగించదు. దీంతో ఆ మేరకు ఖర్చు మిగులుతుంది.
చిన్న ఆయుధాలతో అధిక దాడులు..
ఇజ్రాయెల్ ప్రత్యర్థి అయిన హమాస్ మిలిటెంట్ గ్రూప్ చిన్న స్థాయి ఖాస్సామ్ రాకెట్లను భారీ సంఖ్యలో ప్రయోగిస్తుంటుంది. దీనిని హమాసే ఇరాన్ సహకారంతో అభివృద్ధి చేసింది. ఒక్కో రాకెట్ ఖరీదు 4వేల డాలర్ల లోపే ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఖాస్సామ్ 3 రకాన్ని వినియోగిస్తోంది. వీటిని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ప్రయోగించే ఒక్కో క్షిపణి ఖరీదు 80వేల డాలర్లు(వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం) ఉంటుంది. హమాస్ వద్ద వేల సంఖ్యలో ఖాస్సామ్ రాకెట్లు ఉన్నాయి. అందుకే మంగళవారం మధ్యాహ్నం దాదాపు 200 రాకెట్లను ప్రయోగించింది. ఈ రాకెట్లకు అవసరమైన ముడిపదర్థాలను ఇరాన్ నుంచి ఈజిప్ట్ సరిహద్దుల మీదగా తీసుకొస్తాయన్న ఆరోపణలు ఉన్నాయి.
గత రెండు రోజుల్లో హమాస్ సంస్థ ఇజ్రాయెల్పై దాదాపు 500 రాకెట్లను ప్రయోగించింది. వీటిల్లో చాలా వరకు ఐరన్డోమ్ గాల్లోనే పేల్చేసింది. అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే జనావాసాలపై పడ్డాయి. దీంతో ఇద్దరు చనిపోయారు. అదే ఐరన్ డోమ్ లేకపోతే నష్టం అత్యంత భారీగా ఉండేది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి
పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ (సీపీఐ) కోరారు. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది. -
కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. -
నేడు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. -
డాక్యుమెంట్లపై అసంతృప్తి.. భారతీయులను తిరిగి దుబాయ్కు పంపిన జమైకా
జమైకాలో పర్యటించేందుకు వెళ్లిన కొందరు భారతీయులకు చుక్కెదురైంది. దుబాయ్ నుంచి ఛార్టర్డ్ విమానంలో జమైకా రాజధాని కింగ్స్టన్ను చేరుకున్న భారతీయుల డాక్యుమెంట్లను పరిశీలించిన స్థానిక అధికారులు తృప్తి చెందక పోవడంతో వారిని తిరిగి పంపించారు. -
కిక్కిరిసిపోతున్న కారాగారాలకు బహిరంగ జైళ్లే పరిష్కారం: సుప్రీం కోర్టు
దేశంలో కిక్కిరిసిపోతున్న కారాగారాల సమస్యల పరిష్కారానికి బహిరంగ జైళ్లే పరిష్కారమని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. -
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు.