Shiv Sena: శివసేనకు తిరుగుబాట్ల దెబ్బ.. 56ఏళ్లలో నాలుగోసారి..!
56ఏళ్ల ప్రస్థానంలో పార్టీ అసమ్మతి నేతల నుంచి తిరుగుబాట్లు ఎదుర్కోవడం శివసేనకు ఇది నాలుగోసారి.
అధికారంలో ఉండగా అతిపెద్ద ఎదురుదెబ్బ
ముంబయి: మరాఠీల హక్కుల కోసం మొదలై.. హిందుత్వ ఎజెండాను ఎత్తుకున్న శివసేన (Shiv Sena) మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. క్రితం ఎన్నికల్లో భాజపాకు దూరమై.. విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన కాంగ్రెస్, ఎన్సీపీతో చేయికలిపి సంకీర్ణ (MVA) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చివరకు శివసైనికుల తిరుగుబాటుతో (Revolt) అధికారాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్న శివసేనకు ఈ తిరుగుబాట్లు కొత్తేమీ కాదు. 56 ఏళ్ల ప్రస్థానంలో పార్టీ అసమ్మతి నేతల నుంచి తిరుగుబాట్లు ఎదుర్కోవడం శివసేనకు ఇది నాలుగోసారి. అయితే, గతంలో మూడుసార్లు పార్టీలో ఇటువంటివి చూసినప్పటికీ.. ఈసారి మాత్రం అధికారంలో ఉండగా నాయకత్వంపై ఎదురుతిరగడం పార్టీ చరిత్రలో అతిపెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో మూడుసార్లు శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే (Bal Thackeray) ఉన్నప్పుడు చోటుచేసుకోగా.. ప్రస్తుతం మాత్రం ఆయన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) అధికారంలో ఉన్న సయమంలో నాలుగోది చోటుచేసుకుంది.
1991లో తొలిసారి..
ముంబయి వంటి మహానగరంలో కీలక శక్తిగా ఎదిగిన శివసేనకు.. 1991లో తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలో గ్రామీణ ప్రాంతాలకు పార్టీ విస్తరించడంలో కీలకంగా వ్యవహరించిన ఓబీసీ నేత ఛగన్ భుజ్బల్ శివసేనను వీడడం పెద్ద నష్టాన్నే కలిగించింది. పార్టీ నాయకత్వం తనకు తగినంత గుర్తింపు ఇవ్వడం లేదనే కారణాన్ని చెప్పిన ఆయన.. చాలా సీట్లు గెలిచేందుకు కృషి చేసినప్పటికీ ప్రతిపక్ష నేతగా మనోహర్ జోషిని బాల్ఠాక్రే నియమించడం ఆయన అసంతృప్తికి కారణమయ్యింది. దాంతో 18 మంది శివసేన ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని వీడుతున్నట్లు వెల్లడించిన భుజ్బల్.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అలా ప్రకటించిన రోజే 12 మంది రెబల్ ఎమ్మెల్యేలు సొంతగూటికి (శివసేనకు) చేరుకున్నారు. అయితే, భుజ్బల్తోపాటు ఇతర రెబల్ నేతలను ప్రత్యేక గ్రూపుగా గుర్తించిన స్పీకర్.. వారిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. అనంతరం ఆయన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరిపోయారు. ప్రస్తుతం 74ఏళ్ల భుజ్బల్ ఇప్పటి సంకీర్ణ ప్రభుత్వంలోనూ మంత్రిగా కొనసాగుతుండడం విశేషం.
నారాయణ్ రాణె రూపంలో..
శివసేన ఇటువంటి సవాల్ను 2005లోనూ చవిచూసింది. మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణె పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిపోయారు. అనంతరం కాంగ్రెస్కూ రాజీనామా చేసి భాజపాలో చేరారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాణె కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. కీలక నేత పార్టీని వీడడం శివసేనకు కాస్త ఇబ్బంది కలిగించింది.
షాకిచ్చిన రాజ్ఠాక్రే..
ఇక 2006లోనూ శివసేనకు మరో షాక్ తగిలింది. ఉద్ధవ్ ఠాక్రే సోదరుడు రాజ్ఠాక్రే శివసేనను వీడాలని నిర్ణయించుకోవడం పార్టీని మరోసారి దెబ్బతీసింది. శివసేనను వీడిన రాజ్ఠాక్రే మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేన (MNS) పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అయితే, తన పోరాటం శివసేన నాయకత్వం మీద కాదని.. ఇతరులను రానివ్వకుండా అడ్డుకుంటున్న కొందరిపైనేనని పార్టీని వీడుతున్న సమయంలో రాజ్ఠాక్రే చెప్పుకొచ్చారు. అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో రాజ్ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ 13 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆ సమయంలో శివసేన కంటే ఒకస్థానం అధికంగా గెలుపొందింది.
ఇప్పుడు ఏక్నాథ్..
తాజాగా ఏక్నాథ్ శిందే రూపంలో మరోసారి తిరుగుబాటును ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. అయితే, తమకు శివసేన నాయకత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదని.. కేవలం సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్, ఎన్సీపీల తీరువల్లే రెబల్స్గా మారాల్సి వచ్చిందని చెబుతున్నారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేల బలం ఉందని శిందే క్యాంప్ చెబుతోంది. మహావికాస్ అఘాడీ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ పార్టీ అసంతృప్త నేతలతో శివసేనకు అధికారాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష భాజపాకు మాత్రం అసెంబ్లీలో 106 సభ్యుల బలం ఉంది. అయితే, తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ శిందేపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే ఆయనకు 37మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ శిందేను గుర్తించాలని కోరుతూ 34 మంది ఎమ్మెల్యేలు గవర్నర్కు లేఖ రాశారు. ఇలా పలు సందర్భాల్లో ఆటుపోట్లను ఎదుర్కొన్న శివసేనకు ఈసారి ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
ఝార్ఖండ్లో భారీ మొత్తంలో వెలుగుచూసిన నగదుపై ప్రధాని మోదీ (Modi) స్పందించారు. -
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
తల్లిదండ్రుల తోడు లేకపోయినా.. చదువుతో పాటు తన సోదరి బాధ్యతను మోస్తూ ముందుకెళ్తున్న పదేళ్ల కుర్రాడిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. -
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతడిది హరియాణాలోని కర్నాల్ ప్రాంతం. -
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
ఉగ్ర దాడిలో శనివారం గాయాలపాలై మరణించిన భారత వైమానిక దళ(IAF) సైనికుడు కార్పోరల్ విక్కీ పహాడే మృతదేహం సోమవారం చింద్వారాలోని అతడి స్వగ్రామానికి చేరుకుంది. -
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
అతడు రూ. 15 వేల జీతగాడు. కానీ, అతడి ఇంటిని తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కసారిగా బిత్తరపోయింది. ఓ గదిలో గుట్టలుగా పేర్చిన నగదు చూసి షాకైంది. -
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
గుంతల రహదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిష్కారం కనుక్కోనుంది. నిర్మాణంలో కొత్త మెటీరియలను వినియోగించే అంశంపై పనిచేస్తోంది. -
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
నేడు గుజరాత్లోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దాంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
ఒక రాష్ట్రమంత్రి సహాయకుడికి చెందిన హౌస్కీపర్ ఇంట్లో భారీ సంఖ్యలో కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఎన్నికల వేళ ఈ పరిణామం కలకలం సృష్టిస్తోంది. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా