viral video: నాందేడ్ ఆస్పత్రి డీన్తో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన ఎంపీ!
శివసేన (Shiv Sena) ఎంపీ హేమంత్ పాటిల్ (Hemant Patil) నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రి డీన్తో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Image: Saketrai2000
ముంబయి: గత 48 గంటల్లోనే 31 మరణాలు చోటు చేసుకోవడంతో మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. దాంతో ఏక్నాథ్ శిందే సారథ్యంలోని శివసేన-భాజపా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో శివసేన (Shiv Sena) ఎంపీ హేమంత్ పాటిల్ (Hemant Patil) మరణాలు సంభవించిన శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ క్రమంలో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నట్లు ఆయన గుర్తించారు. వెంటనే ఆస్పత్రి డీన్ శ్యామ్రావ్ వాకోడేను పిలిపించి అపరిశుభ్రతపై గట్టిగా నిలదీశారు. అంతటితో ఆగకుండా డీన్తోనే మరుగుదొడ్లను శుభ్రం చేయించారు.
ఆస్పత్రి డీన్తో ఎంపీ మరుగుదొడ్లు కడిగిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఎంపీ పైపుతో గోడలపై నీళ్లు కొడుతుండగా.. డీన్ వైపర్తో మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ అందులో కనిపించారు. సోమవారం ఇదే ఆస్పత్రిలో 24 గంటల్లోనే 24 మరణాలు సంభవించాయి. మంగళవారానికి ఆ సంఖ్య 31కి చేరింది. ఇంకా 71 మంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. ఆస్పత్రి డీన్ శామ్రావ్ సోమవారం మాట్లాడుతూ మరణాలు చోటు చేసుకోవడానికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, మందుల కొరత కారణం కాదని చెప్పారు. రోగులకు సరైన వైద్యం అందించినా వారు కోలుకోలేదని తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యధిక మరణాలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ‘ప్రచారం కోసం భాజపా ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ, చిన్నారుల కోసం ఔషధాలు కొనుగోలు చేయడానికి మాత్రం డబ్బుల్లేవని’ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్లో పోస్టు పెట్టారు. ఇదే అంశంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం పోస్టు పెట్టారు. గతంతో థానే ఆస్పత్రిలోనూ 18 మంది రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తు చేస్తూ విచారం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.