India Corona: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు... అయినా 3 లక్షల పైనే!
దేశంలో కరోనా వైరస్ ఉద్దృతి చూపిస్తూనే ఉంది. వరుసగా మూడో రోజు మూడు లక్షలపైనే కొత్త కేసులు వెలుగుచూశాయి.
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్దృతి కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు మూడు లక్షలపైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. అయితే శుక్రవారంతో పోలిస్తే కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 19 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,37,704 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు 17.22 శాతంగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో 48 వేల మందికి కరోనా సోకగా.. కేరళలో ఆ సంఖ్య 41 వేలుగా ఉంది. దేశ రాజధాని దిల్లీలో మాత్రం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అక్కడ 10వేల మంది వైరస్ బారినపడ్డారు. 488 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. రెండేళ్ల వ్యవధిలో 3.89 కోట్ల మందికి కరోనా సోకగా.. 4,88,884 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10 వేల మార్కు దాటింది. వాస్తవంలో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని, ఈ వేరియంటే దేశంలో మూడో వేవ్కు కారణమని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 21 లక్షలు దాటాయి. ఆ కేసుల రేటు 5.43 శాతానికి పెరిగింది. తాజాగా మరో 2,42,676 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 3.6 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 93.31 శాతానికి చేరింది. మరోవైపు శుక్రవారం దేశవ్యాప్తంగా 67 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 161 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సువారిలో నాలుగు కోట్ల మందికిపైగా టీకా తొలి డోసు స్వీకరించారు. 74.5 లక్షల ప్రికాషనరీ డోసులు పంపిణీ అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి