Indian flag: అంతరిక్ష కేంద్రంలో మురిసిన మువ్వన్నెల జెండా..!

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకం సందడి చేస్తోంది. ఓ నౌకాదళం ఆరు ఖండాలకు నౌకలను పంపి వేడకలను నిర్వహించగా.. వివిధ దేశాల్లో ఉన్న భారత సంతతి

Updated : 15 Aug 2022 11:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. భారత నౌకాదళం ఆరు ఖండాలకు నౌకలను పంపి వేడుకలను నిర్వహించగా.. వివిధ దేశాల్లో ఉన్న భారత సంతతి వ్యక్తులు ఉత్సాహంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా అమెరికాలోని ప్రముఖ టెస్ట్‌ పైలట్‌, వ్యోమగామి రాజాచారి ఆసక్తికర ఫొటోలు ట్వీట్‌ చేశారు.  ‘‘భారత స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రవాస భారతీయుడిగా నా తండ్రి నగరమైన హైదరాబాద్‌ ఎలా వెలిగిపోతోందో అంతరిక్షం నుంచి వీక్షిస్తున్నా. భారత అమెరికన్లు నిత్యం పురోగమిస్తోన్న వాటిల్లో నాసా కూడా ఒకటి’’ అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా అంతరిక్ష కేంద్రంలో భారత పతాకాన్ని ఆవిష్కరించిన ఫొటోలను షేర్‌ చేశారు. 

మరోవైపు స్పేస్‌ కిడ్స్‌ ఇండియా  సంస్థ ఓ బెలూన్‌ సాయంతో భారత పతాకాన్ని 30 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చింది. అక్కడ పతాకాన్ని ఆవిష్కరించింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని