ప్రమాణస్వీకారానికి గర్వంగా వెళతా..
దేశ పాలనా బాధ్యతలు స్వీకరించనున్న తమకు ముందున్నది అంత సులభమైన మార్గమేమీ కాదని అమెరికా కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో అధ్యక్షుడిగా బైడెన్.......
భద్రతా ముప్పు నేపథ్యంలో కాబోయే ఉపాధ్యక్షురాలి వ్యాఖ్యలు
వాషింగ్టన్: దేశ పాలనా బాధ్యతలు స్వీకరించనున్న తమకు ముందున్నది అంత సులభమైన మార్గమేమీ కాదని అమెరికా కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో అధ్యక్షుడిగా బైడెన్, ఆయన బృందం ఎదుర్కోనున్న సవాళ్లను ఆమె వివరించారు. అయితే, వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దేశాన్ని గాడిన పెట్టేందుకు చేయాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. మార్టిన్ లూథర్ కింగ్ స్మారకార్థం ఏటా జరుపుకొనే ‘నేషనల్ డే ఆఫ్ సర్వీస్’ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే వ్యాక్సినేషన్, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం, ప్రజలకు ఉపాధి కల్పించడం, మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడడం వంటి వాటిపై బైడెన్ తన ప్రణాళికను ప్రకటించారని కమలా హారిస్ తెలిపారు. అయితే, కొంతమంది తమ లక్ష్యాలను విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. కానీ, తమ కృషికి చట్టసభ సభ్యుల సహకారం, సమన్వయం తోడైతే ఆశయాలను చేరుకోవడంలో సఫలీకృతం అవుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి భద్రతా ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘కార్యక్రమానికి వెళ్లడం క్షేమమే అని మీరు భావిస్తున్నారా?’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కమల తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘‘ఈ దేశ తదుపరి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అందుకోసం ప్రమాణం చేసేందుకు వేదిక వద్దకు తలెత్తుకొని గర్వంగా నడుచుకుంటూ వెళతాను’’ అని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు చూస్తుంటే.. మార్టిన్ లూథర్ కింగ్ ఆశయాల సాధన కోసం ఇంకా పోరాడాల్సి ఉందన్న విషయం అర్థమవుతోందన్నారు.
అమెరికాలో నేటికీ ప్రతి ఆరు కుటుంబాల్లో ఒకటి ఆకలితో అలమటిస్తోందని కమల తెలిపారు. అలాగే ప్రతి ఐదిళ్లలో ఒకటి నెల అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉందన్నారు. ఇక ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి కనీస నిత్యావసర వస్తువుల బిల్లులు కట్టే స్థితిలో లేదని వివరించారు. ఈ నేపథ్యంలో యావత్తు దేశం ఏకతాటిపై నిలబడి ఈ రుగ్మతల్ని రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. జవనరి 20న బైడెన్ అధ్యక్షుడిగా.. కమలా హారస్ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లరిమూకలు విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందన్న సంకేతాల నేపథ్యంలో రాజధాని నగరం వాషింగ్టన్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
సందేశ్ఖాలీ కేసు విషయంలో సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని మందలించింది. -
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
PM Modi: బస్టాండ్లో పండ్లు విక్రయించుకుంటూ జీవనం గడిపే ఓ మహిళను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారు. ఇంతకీ ఎవరామె..? -
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
సీఏ పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం (Supreme Court).. పిల్ను విచారించేందుకు నిరాకరించింది. -
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. -
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు.. పలువురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు