Corona: కొవిడ్ కేసులు భారీగా రావడానికి అవే కారణం: వీణా జార్జ్
ఒమిక్రాన్ ‘సహజ వ్యాక్సిన్’ అనీ.. ఇది సోకినా ప్రమాదంలేదంటూ ఓ వర్గం అవాస్తవాలతో పాటు నిరాధారమైన అంశాలను ప్రచారం చేస్తోందన్నారు. వేరియంట్ ఏదైనప్పటికీ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన ఈ సందర్భంగా అవసరాన్ని ఆమె గుర్తుచేశారు. .....
తిరువనంతపురం: థర్డ్ వేవ్లో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న వేళ కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ ప్రజలను మరింత అప్రమత్తం చేశారు. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల కారణంగానే రోజువారీ కొవిడ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయని చెప్పారు. డెల్టా రకంతో పోల్చి చూస్తే ఒమిక్రాన్ వ్యాప్తి 5 నుంచి 6 రెట్లు అధికంగా ఉన్నప్పటికీ.. తీవ్రత మాత్రం తక్కువగానే ఉందన్నారు. అయితే, దీన్ని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ మహమ్మారి నియంత్రణకు నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్, కొవిడ్ మహమ్మారికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒమిక్రాన్ ‘సహజ వ్యాక్సిన్’ అనీ.. ఇది సోకినా ప్రమాదంలేదంటూ ఓ వర్గం అవాస్తవాలతో పాటు నిరాధారమైన అంశాలను ప్రచారం చేస్తోందన్నారు. వేరియంట్ ఏదైనప్పటికీ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన ఈ సందర్భంగా అవసరాన్ని ఆమె గుర్తుచేశారు.
5శాతం అధికంగా కేసులు పెరగొచ్చు!
సెకండ్ వేవ్లో అత్యధిక కేసులకు డెల్టా వేరియంట్ కారణమనీ.. అది ముగియకముందే థర్డ్ వేవ్ మొదలైందన్నారు. ఇప్పుడు డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లతో కొవిడ్ కేసులు సంఖ్య భారీగా నమోదవుతోందన్నారు. ప్రస్తుతం ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉందన్న మంత్రి వీణా జార్జ్.. సెకండ్ వేవ్తో పోలిస్తే థర్డ్వేవ్లో 5శాతం అధికంగా కేసులు నమోదయ్యే అవకాశం కనబడుతోందన్నారు. ఈ నేపథ్యంలో టీకా తీసుకోవడంతో పాటు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించడం ఎంతో అవసరమన్నారు. అనవసరంగా ఆస్పత్రులకు వెళ్లడం తగ్గించుకోవాలని; వయస్సు పైబడిన వారు, దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అత్యవసర ఔషధాల కొరత ఉందంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై స్పందిస్తూ.. పరిస్థితిని ఎదుర్కొనేందుకు వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉందని చెప్పారు. ఆస్పత్రుల్లో రద్దీ కారణంగా కాస్త ఆలస్యం జరగడం సాధారణమేనన్నారు. కొవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాజకీయాలకు అతీతంగా విబేధాలను పక్కనబెట్టి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కేరళలో నిన్న ఒక్కరోజే 28,481 కొత్త కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి బారినపడి 39మంది మృతిచెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,42,512కి పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
ఒక రాష్ట్రమంత్రి సహాయకుడికి చెందిన హౌస్కీపర్ ఇంట్లో భారీ సంఖ్యలో కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఎన్నికల వేళ ఈ పరిణామం కలకలం సృష్టిస్తోంది. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా