Corona: కేరళలో భారీగా కొవిడ్ కేసులు.. ఆదివారాల్లో అత్యవసర సేవలకేఅనుమతి!
దేశంలో కరోనా మహమ్మారి ఉరుముతోంది. ఒమిక్రాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కేరళలో గతంలో ఎన్నడూ లేనంతగా ......
తిరువనంతపురం: దేశంలో మరోసారి కరోనా మహమ్మారి ఉరుముతోంది. ఒమిక్రాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కేరళలో గతంలో ఎన్నడూ లేనంతగా కొవిడ్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 1.15 లక్షల టెస్టులు చేయగా.. 46,387 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించినప్పట్నుంచి అక్కడ ఇంత భారీగా రోజువారీ కేసులు రావడం ఇదే తొలిసారి. గతేడాది మే 12న అత్యధికంగా 43,529 కొవిడ్ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
కొత్త కేసులతో కలుపుకొంటే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 54,87,898కి పెరిగింది. మరోవైపు, కొవిడ్ బాధితుల్లో 341 మంది మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 51,501కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,99,041గా ఉంది. తిరువనంతపురంలో అత్యధికంగా 9,720 కొత్త కేసులు రాగా.. ఎర్నాకుళంలో 9605, కోలికోడ్ 4016 చొప్పున కొవిడ్ కేసులు వచ్చాయి. మరోవైపు, కేరళలో ఒమిక్రాన్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. కొత్తగా మరో 62 ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో అక్కడ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 707కి పెరిగినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
ఆదివారాల్లో అత్యవసరసేవలకే అనుమతి!
కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో మరింత అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం పలు ఆంక్షలు ప్రకటించింది. వైద్యం కోసం అమెరికా వెళ్లిన సీఎం పినరయి విజయన్ అక్కడి నుంచే అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే రెండు ఆదివారాల్లోనూ పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించనుంది. ఈ నెల 23, 30 తేదీల్లో అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతించనున్నారు. రెండేళ్ల లోపు పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులతో పాటు క్యాన్సర్ రోగులు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వర్క్ఫ్రం హోం సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. వాణిజ్య సముదాయాలు, మాల్స్, బీచ్లు, పార్కులు వంటి పర్యాటక ప్రదేశాల్లో జనం గుమిగూడకుండా కఠిన ఆంక్షలు అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఆదివారాల్లో మాల్స్, సినిమా థియేటర్లు మూసి ఉంచనున్నారు. అలాగే, అన్ని తరగతులనూ ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో నమోదైన కేసుల ఆధారంగా జిల్లా అధికార యంత్రాంగాలు కొత్త ఆంక్షలు అమలుచేసేందుకు అవకాశం కల్పించారు.
కేసుల తీవ్రత, ఆస్పత్రిపాలైన వారి సంఖ్యను బట్టి రాష్ట్రంలోని జిల్లాలను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించి ఆంక్షలు అమలుచేయనున్నారు. తిరువనంతపురంతో పాటు పాలక్కడ్, ఇడుక్కి, వయనాడ్ జిల్లాలు కేటగిరీ -బిగా విభజించారు. ఆయా జిల్లాల్లో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన, బహిరంగ సమావేశాలకు అనుమతిలేదు. మత సంబంధమైన కార్యక్రమాలు ఆన్లైన్లో మాత్రమే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. వివాహాలు, అంత్యక్రియలు వంటి సామాజిక కార్యక్రమాలకు 20మంది మించరాదని స్పష్టంచేశారు. అలాగే, ఎర్నాకుళం, కొల్లం, అళప్పుజ కేటగిరీ- ఏ జిల్లాలు. ఆ జిల్లాల్లో పైన పేర్కొన్న కార్యక్రమాలకు 50మందికి మించరాదు. సీ- కేటగిరీలో ఇప్పటివరకు ఏ జిల్లాలనూ చేర్చలేదు. అక్కడ జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్కు అనుమతిలేదు. వివాహాలు, అంత్యక్రియలకు కేవలం 20మంది వరకే అనుమతించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
భారత్ ప్రపంచవ్యాప్తంగా స్నేహపూర్వకమైన దేశంగా మాత్రమే కాకుండా శక్తిమంతమైన దేశంగాను పేరు పొందుతుందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్లో 25వేల ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భారత సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. -
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
Karnataka Sex Tape Row: ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారంపై తన బాబాయ్ కుమారస్వామి స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
Supreme Court: పశ్చిమబెంగాల్లో చోటుచేసుకున్న ఉపాధ్యాయ నియామక కుంభకోణం.. వ్యవస్థీకృత మోసం అని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈసందర్భంగా దీదీ సర్కారుకు చురకలంటించింది. -
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
వందల కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడిన ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినప్పుడు వారి ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని ముస్లిం సోదరీమణులు భావించారని ప్రధాని మోదీ(Modi) వెల్లడించారు. -
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
ఇస్త్రీ చేసిన దుస్తులు కాకుండా ముడతల దుస్తులు వేసుకోవాలని పరిశోధక సంస్థ సీఎస్ఐఆర్ (CSIR) తన సిబ్బందిని కోరింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
Arvind Kejriwal: మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. ఆయన సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, దీనిపై ప్రస్తుతానికి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ-కశ్మీర్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!