Khushbu Sundar: రాహుల్కు జైలుశిక్ష.. వైరల్ అవుతున్న ఖుష్బూ పాత ట్వీట్
భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) కూడా గతంలో ప్రధాని మోదీ పేరును కించపర్చేలా మాట్లాడిందని, ఆమెపై ఇప్పుడు కేసు పెడతారా? అని కాంగ్రెస్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఆమె చేసిన పాత ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని మోదీ (Modi) ఇంటిపేరును కించపర్చారన్న అభియోగాలపై కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి జైలు శిక్ష పడటం, ఆ తర్వాత ఆయన లోక్సభ సభ్యత్వం (Disqualification) రద్దవడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ పరిణామాలతో కేంద్రంపై విపక్షాలు భగ్గుమంటున్న వేళ.. భాజపా (BJP) నాయకురాలు ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో ఖుష్బూ.. ప్రధానిపై ఘాటు విమర్శలు చేశారు.
2018లో ఖుష్బూ (Khushbu Sundar) కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ ఓ ట్వీట్ చేశారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ కుంభకోణాలను ప్రస్తావించిన ఆమె.. ‘‘మోదీ (Modi) అంటే అర్థం అవినీతి అని మార్చాలి. అది సరిగ్గా సరిపోతుంది’’ అంటూ విరుచుకుపడ్డారు. రాహుల్ (Rahul Gandhi) కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలోనే ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆయనపై అనర్హత వేటు పడింది.
దీంతో కాంగ్రెస్ మద్దతుదారులు ఇప్పుడు ఖుష్బూ పాత ట్వీట్ను వైరల్ చేస్తూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమెపై కూడా కేసు పెడతారా అంటూ భాజపాను ప్రశ్నిస్తున్నారు. 2020లో ఖుష్బూ కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. భాజపాలో చేరిన తర్వాత నేతలపై కేసులు మాయమవుతున్నాయని దుయ్యబడుతున్నాయి. ఈ క్రమంలో ఖుష్బూ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
2019లో ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ (Rahul Gandhi).. ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అని వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్కు చెందిన భాజపా నేత పూర్నేశ్ మోదీ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ న్యాయస్థానం.. రాహుల్కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వచ్చిన 24 గంటల్లోగా రాహుల్పై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సెక్రటేరియట్ నిన్న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
పాత ట్వీట్పై స్పందించిన ఖుష్బూ
గతంలో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ తాను చేసిన ట్వీట్పై ఖుష్బూ స్పందించారు. పార్టీ ఆదేశాల మేరకే తాను అలా స్పందించానని, అప్పటి పార్టీ అధినేత వైఖరినే అనుసరించినట్లు చెప్పారు. ‘ఆ సమయంలో నేను కాంగ్రెస్లో ఉన్నా. పార్టీ అధికార ప్రతినిధిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించా. మేం అలాగే మాట్లాడాలి. నేనూ అదే చేశా. అభిప్రాయాల వ్యక్తీకరణ విషయంలో పార్టీ అధినేతను అనుసరించా’ అని వివరించారు. తన ట్విటర్ ఖాతాలో ఇప్పటివరకు ఏ ట్వీట్నూ తొలగించలేదని, ఆ పోస్టునూ కూడా తొలగించనని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?