Security breach in LS: ఆ పొగ గొట్టాన్ని లాక్కొని.. బయటపడేశా..!
బుధవారం లోక్సభ (Lok sabha)లో ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు. వారు వెంట తెచ్చిన వస్తువులు విడుదల చేసిన గ్యాస్ సభ అంతా ఆవరించింది.
దిల్లీ: సభ కార్యకలాపాలు కొనసాగుతోన్న సమయంలో లోక్సభలోకి ఇద్దరు దుండగులు దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. వారిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఆజ్లా( Gurjeet Singh Aujla) చాకచక్యంగా వ్యవహరించారు. ఆయన ఒక దుండగుడి వద్ద ఉన్న పొగ గొట్టాన్ని స్వాధీనం చేసుకున్నారు.(Security breach in LS)
‘సభలోకి దూసుకొచ్చిన వ్యక్తి చేతిలో ఉన్న వస్తువు(గొట్టం ఆకారంలో) నుంచి పసుపు రంగు గ్యాస్ వెలువడింది. అతడి నుంచి నేను దానిని లాగి, బయటకు విసిరాను. ఈ ఘటన అతిపెద్ద భద్రతా వైఫల్యం’ అని గుర్జీత్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో కొందరు ఎంపీలు బయటకు పరిగెత్తగా.. మరికొందరు ఆ దుండగుల వైపుగా వేగంగా వెళ్లి వారిని పట్టుకున్నారు. అనంతరం వారిని భద్రతా సిబ్బందికి అప్పగించారు.
మరోవైపు, దుండగులు లోక్సభ(Lok Sabha)లోకి చొరబడి అలజడి సృష్టించిన ఘటనపై పలువురు ఎంపీలు, నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోక్సభలో భద్రతా వైఫల్యానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ‘ఇద్దరు వ్యక్తులు సభలోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు. వారు స్పీకర్ కుర్చీవైపు వెళ్లే ప్రయత్నం చేశారు. సరిగ్గా 2001లో పార్లమెంట్పై దాడి జరిగిన ఈ రోజు(డిసెంబర్ 13)నే ఈ తరహా ఘటన జరగడం..తీవ్రమైన భద్రతా వైఫల్యం కిందికి వస్తుంది’ అని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు.
సత్వరమే కఠిన చర్యలు చేపట్టాలి: కేజ్రీవాల్ డిమాండ్
ఈరోజు పార్లమెంటులో జరిగిన భద్రతా వైఫల్యం ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర విఘాతమని దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Kejriwal) అన్నారు. ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంటుకు భద్రత విషయంలో రాజీపడరాదని సూచించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో స్పందించారు. ఈ దుశ్చర్యకు ఒడిగట్టినవారు ఎవరు? వాళ్లు లోపలికి ఎలా ప్రవేశించారు? వారి ఉద్దేశాలు ఏమిటో తెలుసుకొనేందుకు తక్షణ విచారణ అవసరమన్నారు. ఈ ఘటనపై సత్వరమే కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు: కేసీ వేణుగోపాల్
‘‘పార్లమెంట్పై ఉగ్రదాడి జరిగి సరిగ్గా 22 ఏళ్లు పూర్తయిన రోజే లోక్సభలోకి దుండగులు చొరబడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడం ఉపశమనం ఇస్తోంది. దేశంలోనే అత్యంత భద్రతతో కూడిన భవనాల్లో పార్లమెంట్ ఒకటి. అలాంటి చోట ఇంత పెద్ద భద్రతా వైఫల్యం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమాధానం చెప్పాలి. కొత్త పార్లమెంట్ భవనంలో భద్రతా ఏర్పాట్లపై క్షుణ్ణంగా సమీక్షించాలి’’ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.
ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం: డింపుల్ యాదవ్
‘‘లోక్సభలోకి చొరబడిన వ్యక్తులు సందర్శకులు కావొచ్చు లేదంటే ఇతరులు కావొచ్చు.. వాళ్ల దగ్గర ట్యాగ్స్ ఏమీ లేవు. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమేనని భావిస్తున్నాం. సభలో ఏమైనా జరగవచ్చు’’ అని సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ అన్నారు.
చాలా భయంకరమైన అనుభవం: టీఎంసీ ఎంపీ
‘‘ఇది చాలా భయంకరమైన అనుభవం. వారి లక్ష్యం ఏంటో, ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికీ తెలియడంలేదు. తక్షణమే మేం సభ నుంచి బయటకు వచ్చేశాం.. కానీ ఇది భద్రతా వైఫల్యం. పొగ విడుదల చేసే పరికరాలతో వాళ్లు ఎలా లోపలికి ప్రవేశించారో?!’’ అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ ఆందోళన వ్యక్తంచేశారు.
-
‘‘ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.. వాళ్లుకిందకు దూకినప్పుడు వెనుక బెంచీలు ఖాళీగా ఉన్నాయి. దీంతో వాళ్లను పట్టుకున్నాం. ఆ సమయంలో సభలో ఇద్దరు మంత్రులు ఉన్నారు’’ అని శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తెలిపారు.
-
లోక్సభలో భద్రతా వైఫల్యానికి సంబంధించిన ఘటనను భారాస నేత, తెలంగాణ మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన ‘ఎక్స్’వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యులందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థించారు. ఈ ఘటనలో దోషుల్ని శిక్షించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
Bail conditions for Pune teen: తన డ్రైవింగ్తో ఇద్దరి మృతికి కారణమైన ఓ మైనర్కు పుణె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, షరతుల కింద ప్రమాదంపై ఆ బాలుడిని వ్యాసం రాయమని న్యాయస్థానం చెప్పడం గమనార్హం. -
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు
సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటేశారు. మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. -
ఐదో విడతలో జోరెవరిదో!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. -
మాలీవాల్ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. -
సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత
పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించనుంది. -
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది. -
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలు రేగాయి. -
అత్యంత పొట్టి మహిళతో ‘ది గ్రేట్ ఖలీ’ ముచ్చట్లు
‘ది గ్రేట్ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ దలీప్ సింగ్ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు. -
పుదుచ్చేరి బీచ్లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న దండన
చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్లో స్నానాలు నిషేధించింది. -
అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటేశారు
రాజస్థాన్లోని భరత్పుర్ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్ (62) వాపోయారు. -
డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగిలి రైలు ప్రయాణికులకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాజధాని నగరం రాయ్పుర్ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. -
విశ్వ మానవులం!
ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. -
రాజకీయాలకు మేం అతీతం
సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి. -
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బ్రాండ్ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
తిరుమలలో మరోసారి చిరుతల కలకలం.. భయంతో భక్తుల కేకలు
-
ప్రపంచకప్ ఒత్తిడిని ఎదుర్కోవడం రోహిత్కు బాగా తెలుసు: ధావన్
-
ఆ భాండాగారం తాళం చెవులు ఎక్కడ..? ప్రశ్నించిన మోదీ
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి 18 మంది మృతి