Mukesh Ambani: కేదార్నాథ్- బద్రీనాథ్ క్షేత్రాలకు ముకేశ్ అంబానీ భారీ విరాళం
కేదార్నాథ్-బద్రీనాథ్ ఆలయ కమిటీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భారీ విరాళం అందజేశారు.
దేహ్రాదూన్: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఉత్తరాఖండ్లో పర్యటించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడి ప్రఖ్యాత కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించుకున్నారు. చమోలీ జిల్లాలోని బద్రీనాథ్, రుద్రప్రయాగ్జిల్లాలోని కేదార్నాథ్ ఆలయాల్లో పూజలు నిర్వహించిన అనంతరం కేదార్నాథ్- బద్రీనాథ్ ఆలయ కమిటీ (BKTC)కి రూ.5 కోట్లు విరాళం అందజేశారు. ఈ పర్యటనలో అంబానీ వెంట తనకు కాబోయే కోడలు రాధికా మర్చంట్ ఉన్నారు. తొలుత అక్కడికి చేరుకున్న ముకేశ్ అంబానీకి బీకేటీసీ ఛైర్మన్, భాజపా నేత అజేంద్ర అజయ్తో పాటు కమిటీ ఉపాధ్యక్షుడు కిశోర్ పవార్ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా బీకేటీసీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ మాట్లాడుతూ.. ముకేశ్ అంబానీ ఈరోజు కేదార్నాథ్, బద్రీనాథ్లో పూజలు నిర్వహించినట్టు తెలిపారు. కేదార్నాథ్-బద్రీనాథ్ ఆలయ కమిటీ(BKTC)కి రూ.5కోట్లు విరాళం చెక్కును అందజేశారని వెల్లడించారు. విరాళం అందజేసినందుకు గాను ముకేశ్ అంబానీకి తమ ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు చెప్పామని అన్నారు. అలాగే, ఆలయ కమిటీ ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులపై ఆయనతో చర్చించగా.. సాధ్యమైనంత మేరకు సాయం చేస్తానని అంబానీ హామీ ఇచ్చారని అజయ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్