PM Modi: మహిళా శక్తి అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తా: మోదీ
తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే దేశంలో మహిళల అభివృద్ధి విషయంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తానని ప్రధాని మోదీ(PM Modi) పేర్కొన్నారు.
దిల్లీ: తాను మూడోసారి ప్రధానిగా గెలిస్తే దేశంలో మహిళల అభివృద్ధికి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తానని ప్రధాని మోదీ(PM Modi) పేర్కొన్నారు. సోమవారం దిల్లీలో జరిగిన సశక్త్ నారీ-వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని స్త్రీలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏ సమాజం అయితే మహిళల అభివృద్ధికి అవకాశాలు కల్పిస్తుందో ఆ సమాజం వృద్ధి చెందుతుందని తాను నమ్ముతానని అన్నారు. తమ ప్రభుత్వం వనితల కోసం అమలుచేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉదహరించారు.
కార్యక్రమంలో భాగంగా స్వయంసహాయక బృందాలకు (ఎస్హెచ్జీ) బ్యాంకు రుణాలుగా దాదాపు రూ.8,000 కోట్లను మోదీ పంపిణీ చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకోగలమన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.
వివిధ ప్రభుత్వ పథకాల కింద రూ.8 లక్షల కోట్లకు పైగా నగదును మహిళలకు పంపిణీ చేశామని ప్రధాని మోదీ తెలిపారు. ఇప్పటివరకు కోటి మంది స్త్రీలు లఖపతి దీదీలుగా మారారని ఆయన చెప్పారు. మహిళలకు చిన్న సహాయం చేసినా వారు తిరిగి ఇతరులకు సహాయం చేస్తారనే విషయం తన అనుభవం ద్వారా తెలుసుకున్నానన్నారు. తమ కుటుంబాల గురించి మాత్రమే ఆలోచించే రాజకీయ నాయకులు దీనిని ఎప్పటికీ అర్థం చేసుకోలేరని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వాలు మహిళల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చేవి కావని తమ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో పథకాలను చేపట్టిందని తెలిపారు. మహిళలు గౌరవంగా జీవించడానికి వారికి మరుగుదొడ్లు ఏర్పాటుచేయడం, శానిటరీ ప్యాడ్ల వాడకం గురించి అవగాహన కల్పించడం, వంట చెరుకు పొగ వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించడం వంటి మహిళల సమస్యల గురించి మాట్లాడిన మొదటి ప్రధాని తానే అని మోదీ పేర్కొన్నారు. ఇలా చేసినందుకు కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీలు నాడు తనను ఎగతాళి చేశాయని, అవమానించాయని గుర్తు చేసుకున్నారు.
అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా లబ్ధిదారులతో ఆయన మాట్లాడి వారి పని గురించి అడిగి తెలుసుకున్నారు. దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ మద్దతుతో విజయం సాధించిన, స్వయం సహాయక బృందాల అభ్యున్నతికి సహకరిస్తున్న ‘లఖపతి దీదీ’లను మోదీ సత్కరించారు. ఈ సందర్భంగా, వ్యవసాయ సంబంధిత ప్రయోజనాల కోసం డ్రోన్లను ఆపరేట్ చేయడానికి ఎంపికైన 1,000 మంది ‘నమో డ్రోన్ దీదీస్’ మహిళలకు వాటిని అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Express: ఇంజిన్లో మంటలు చెలరేగటంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం అత్యవసరంగా ల్యాండయ్యింది. -
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
Prajwal Revanna: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
-
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!