Boycott Olympics: ఆట మొదలు..!
వీగర్ ముస్లింల విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరితో బీజింగ్ వింటర్ ఒలిపిక్స్ -2022కు ఎసరు వచ్చేట్లుంది. ఈ ఒలింపిక్స్ను ప్రపంచ దేశాలు బహిష్కరించడం
* బీజింగ్ ఒలింపిక్స్కు బాయ్కాట్ భయం
* గళమెత్తిన నాన్సీ పెలోసీ
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
వీగర్ ముస్లింల విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరితో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ -2022కు ఎసరు వచ్చేట్లుంది. ఈ ఒలింపిక్స్ను ప్రపంచ దేశాలు బహిష్కరించడం గానీ, వేదికను మార్చడం గానీ చేయాలన్న డిమాండ్లు మెల్లగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే 180కిపైగా మానవ హక్కుల సంస్థలు ఈ ఒలింపిక్స్ను బహిష్కరించాలనే డిమాండ్లను ప్రభుత్వాల ముందు పెట్టాయని ‘ది గార్డియన్ ’ పత్రిక పేర్కొంది. దీంతో చైనా వీటిని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొన్ని సందర్భాల్లో బహిరంగంగా బెదిరింపులకు దిగుతోంది.
తాజాగా వీగర్ల విషయంలో చైనాను కట్టడి చేయడానికి ఒలింపిక్స్ను ఆయుధంగా వాడాలని అమెరికాలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరైనా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ మరోసారి తెరపైకి తెచ్చారు. మంగళవారం ఆమె అమెరికా కాంగ్రెస్ విచారణలో మాట్లాడుతూ చైనా వీగర్లపై చేస్తున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా బీజింగ్లో 2022లో జరిగే ఒలింపిక్స్ను దౌత్యపరంగా బహిష్కరించాలని(డిప్లొమేటిక్ బాయ్కాట్) పిలుపునిచ్చారు. అక్కడ ఎటువంటి తప్పు జరగకపోతే తాము ఈ నిర్ణయం తీసుకోమని అన్నారు. ప్రపంచ దేశాల అధినేతలు ఎవరూ ఈ ఒలింపిక్స్ కార్యక్రమాలకు హాజరుకాకూడదన్నారు. ఇప్పటికే ఆమె అమెరికా మిత్రదేశాల దేశాధినేతలు కూడా ఈ ఒలింపిక్స్కు హాజరుకాకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సీఎన్బీసీ కథనంలో పేర్కొంది. ఒక మానవ హక్కుల సంస్థ సోమవారం అమెరికా నాయకులకు బహిరంగ లేఖ రాసిన తర్వాత పెలోసీ నుంచి ఇటువంటి ప్రతిపాదన వచ్చింది.
డిప్లొమేటిక్ బాయ్కాట్ అంటే..?
డిప్లొమేటిక్ బాయ్కాట్ అంటే క్రీడలను బాయ్కాట్ చేయడం కాదు. అథ్లెట్లు హాజరై క్రీడల్లో పాల్గొంటారు. కానీ, ఒలింపిక్స్లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమం, ముగింపు కార్యక్రమం వంటి వాటికి దేశాధినేతలు, కీలక అధికారులు హాజరుకాకపోవడం. ఇలా చేయడం వల్ల ఆ ఒలింపిక్స్ ప్రాధాన్యం తగ్గిపోతుంది. అదే సమయంలో చైనా వీగర్ల పట్ల చేస్తున్న అత్యాచారాలు ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచి చర్చనీయాంశాలు అవుతాయి. ఆ రకంగా చైనాపై ఒత్తిడి పెరుగుతుంది.
ఎవరీ నాన్సీ పెలోసి..?
అమెరికాలోని మేరీల్యాండ్లోని బాల్టిమోర్లో 1940 మార్చి 26న రాజకీయ కుటుంబంలో జన్మించింది నాన్సీ పెలోసి. తండ్రి, సోదరుడు ఈస్ట్ కోస్ట్ పోర్ట్ సిటీ మేయర్లుగా పనిచేశారు. వాషింగ్టన్లో రాజనీతి శాస్త్రం చదివిన నాన్సీ... తొలిసారి కాలిఫోర్నియా నుంచి పోటీ చేసి కాంగ్రెస్లోకి అడుగుపెట్టింది. భర్త పేరు పాల్ పెలోసి. వ్యాపారవేత్త. ఫేస్బుక్, ఆపిల్, డిస్నీ లాంటి సంస్థల్లో కూడా ఈయనకి వాటాలున్నాయి. వీరికి ఐదుగురు పిల్లలు. అమెరికా రాజకీయాల్లో ప్రత్యర్థులకు మింగుడుపడని మహిళగా నాన్సీకి పేరుంది. ట్రంప్ను ముప్పుతిప్పలు పెట్టిన డెమొక్రాట్ కూడా ఈమే కావడం విశేషం.
గతంలో చెప్పినా.. బుష్ వినలేదు..
చైనా అరాచకాల విషయంలో నాన్సీ మొదటి నుంచి తీవ్రంగానే స్పందించేవారు. గతంలో టిబేట్ వాసులపై చైనా అరాచకాలపై గళం విప్పారు. జార్జి డబ్ల్యూ బుష్ అధికారంలో ఉండగా అప్పట్లో జరిగిన బీజింగ్ సమ్మర్ ఒలింపిక్స్ను బహిష్కరించాలని ఆయనకు సూచించారు. అప్పటికే ఆమె యూఎస్ హౌస్ స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బుష్ బీజింగ్ సందర్శించడాన్ని మరింత కఠినతరం చేసేలా ఆమె భారత్కు వచ్చి దలైలామాతో భేటీ కూడా అయ్యారు. చైనా ప్రభుత్వం టిబేట్ స్వయం ప్రతిపత్తిపై దలైలామాతో చర్చించాలని ఏబీసీ న్యూస్ ఛానల్లో జరిగిన ‘గుడ్మార్నింగ్ అమెరికా’ ప్రోగ్రామంలో పేర్కొన్నారు. కానీ, నాటి అధ్యక్షుడు బుష్ ఆమె మాట వినలేదు. బీజింగ్ ఒలింపిక్స్కు హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయి ఇరుదేశాల మధ్య వివాదాలను తగ్గించుకొనేందుకు దీనిని అవకాశంగా మార్చుకొన్నారు. ఈసారి పెలోసీ మాటను ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఎంతమేరకు వింటారు అనేది ప్రశ్నార్థకమే.
యూకే కూడా బహిష్కరణ బాటలో..?
యూనైటెడ్ కింగ్ డమ్లోని లేబర్, కన్జర్వేటీవ్ పార్టీ నేతలు ఇప్పటికే ఒలింపిక్స్ను పూర్తిగా బహిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఐరోపా సంఘంలోని చాలా దేశాల ప్రజాప్రతినిధులు కూడా వీగర్లకు మద్దతుగా నిలుస్తున్నారు. గతేడాది నవంబర్లో ఆస్ట్రేలియాలోని ఇద్దరు సెనెటర్లు కూడా ఈ ఒలింపిక్స్ను బహిష్కరించాలనే ప్రతిపాదనలు తీసుకొచ్చారు.
చైనా బెదిరింపులు..
గత నెలలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ వీగర్ల విషయంలో మిత్రపక్షాలతో మాట్లాడి వ్యూహాన్ని సిద్ధం చేస్తామని అన్నారు. ఈ వ్యూహంలో ఒలింపిక్స్ బహిష్కరణ కూడా ఒక మార్గంగా అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. దీనిపై అప్పట్లో శ్వేతసౌధం సెక్రటరీ జెన్సాకీ స్పందిస్తూ ప్రస్తుతానికి ఒలింపిక్స్ బహిష్కరణ అంశాన్ని పరిశీలించడంలేదని పేర్కొన్నారు. దీనిపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ తీవ్రంగా స్పందించారు. అమెరికా కనుక ఈ క్రీడలను బహిష్కరిస్తే చైనా నుంచి తీవ్రమైన స్పందన ఉంటుందని పేర్కొన్నారు. క్రీడలను రాజకీయం చేస్తే ఒలింపిక్ స్ఫూర్తి దెబ్బతింటుందని అన్నారు. తాజాగా నాన్సీ పెలోసీ వంటి బడానేత ఈ డిమాండ్ను ముందుకు తీసుకురావడంతో మళ్లీ చైనాలో టెన్షన్ మొదలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?