Nitish Kumar: నీతీశ్జీ.. ప్రధాని కావాలనే పగటికలలు మానండి: భాజపా కౌంటర్
ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేదని, అందువల్ల బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish Kumar) తన పగటికలలు మాని తన రాష్ట్రంపై దృష్టిపెట్టాలని భాజపా (BJP) దుయ్యబట్టింది. దిల్లీ సీఎం కేజ్రీవాల్తో నీతీశ్ భేటీ నేపథ్యంలో కాషాయ పార్టీ ఈ విమర్శలు గుప్పించింది.
దిల్లీ: భాజపా (BJP)కు వ్యతిరేకంగా విపక్షాలను ఐక్యం చేయడంలో బిజీబిజీగా ఉన్నారు బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ (JDU) అధినేత నీతీశ్ కుమార్ (Nitish Kumar). గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష నేతలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం దిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)తో నీతీశ్ భేటీ అయ్యారు. దీనిపై స్పందించిన భారతీయ జనతా పార్టీ.. జేడీయూ నేతపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. నీతీశ్జీ.. ప్రధాని కావాలనే పగటికలలు మాని బిహార్పై దృష్టి పెట్టాలని ఎద్దేవా చేసింది.
బిహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav)తో కలిసి దిల్లీకి వెళ్లిన నీతీశ్.. ఆదివారం కేజ్రీవాల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్లా ఓ ‘రాజ్యసభ ప్లాన్ (Rajyasabha Plan)’ను నీతీశ్ వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం. అంతేగాక, పాలనావ్యవహారాల విషయంలో ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను కూడా నీతీశ్ వ్యతిరేకించారు.
ఈ క్రమంలోనే తాజా పరిణామాలపై భాజపా (BJP) జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా స్పందిస్తూ నీతీశ్ (Nitish Kumar)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఇతర పార్టీల నేతలతో నీతీశ్ సమావేశమవడం సరైందే కావొచ్చు. కానీ, ఆయన తన సొంత రాష్ట్రంపై దృష్టి పెట్టట్లేదు. ప్రధానమంత్రి కావాలని ఆయన పగటికలలు కంటున్నారు. అవి మాని.. బిహార్ ముఖ్యమంత్రిగా తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తిస్తే మంచిది’’ అని ఎద్దేవాచేశారు. బిహార్లోని భాజపా ఎమ్మెల్సీ సంజయ్ మయూఖ్ స్పందిస్తూ.. ‘‘నీతీశ్జీ తన కలల ప్రపంచం నుంచి బయటకు రావాలి. ప్రధాని పోస్ట్ ఖాళీగా లేదు’’ అని ఎద్దేవా చేశారు.
2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత (Opposition Unity)పై ఆయా పార్టీల నేతల మధ్య సమాలోచనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా వేగం పెంచిన నీతీశ్ కుమార్.. విపక్ష నేతలతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రధాని పదవికి పోటీ చేయాలని నీతీశ్ ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, వీటిని బిహార్ సీఎం ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే ఉన్నారు. తనకు ప్రధాని కావాలనే ఆశ లేదని, విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కలిసి ముందుకెళ్తే చూడాలన్నదే తన కల అని గతంలో ఆయన ఓసారి స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
సందేశ్ఖాలీ కేసు విషయంలో సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని మందలించింది. -
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
PM Modi: బస్టాండ్లో పండ్లు విక్రయించుకుంటూ జీవనం గడిపే ఓ మహిళను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారు. ఇంతకీ ఎవరామె..? -
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
సీఏ పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం (Supreme Court).. పిల్ను విచారించేందుకు నిరాకరించింది. -
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. -
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?