Omicron: ఒమిక్రాన్ పుట్టుకకు జలుబూ సహకరించిందా?
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. దీనిపై సమగ్ర సమాచారం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు....
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. దీనిపై సమగ్ర సమాచారం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తే కట్టడి సులభమయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో మసాచూసెట్స్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ డేటా అనలిటిక్స్ ఎన్ఫరెన్స్ సంస్థ కీలక విషయాన్ని తెరపైకి తెచ్చింది. ఒమిక్రాన్లో వచ్చిన పరివర్తనాల్లో కనీసం ఒకటి సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్ వల్ల అయి ఉంటుందని పేర్కొంది. ఈ అధ్యయనానికి వెంకట సౌందరాజన్ అనే శాస్త్రవేత్త నేతృత్వం వహించారు. దీన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.
కరోనా, జలుబు రెండూ సోకిన వ్యక్తిలో ఈ పరివర్తనం జరిగి ఉంటుందని అధ్యయనం తెలిపింది. రెండు వైరస్లతో ఇన్ఫెక్ట్ అయిన కణంలో ఈ ప్రక్రియ చోటు చేసుకొని ఉంటుందని పేర్కొంది. ఊపిరితిత్తులు, జీర్ణశయాంతర వ్యవస్థల్లో కరోనా వైరస్, జలుబు వైరస్ రెండూ ఒకేసారి కలిసి ఉండే అవకాశం ఉందని గతంలో కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ఆ సమయంలోనే వైరల్ రీకాంబినేషన్ జరిగి ఉంటుందని తాజా పరిశోధన తెలిపింది. ఈ ప్రక్రియలో సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్లోని కొంత జన్యు పదార్థాన్ని కరోనా వైరస్ తీసుకొని ఉంటుందని తెలిపింది. ఒమిక్రాన్లో వచ్చిన అనేక పరివర్తనాల్లో ఒకదానికి ఇది కారణమై ఉంటుందని వెల్లడించింది. ఈ పరివర్తనంలో ఉన్న జన్యుక్రమం గతంలో వచ్చిన ఏ వేరియంట్లోనూ కనిపించలేదని తెలిపింది. కానీ, జలుబుకు కారణమయ్యే వైరస్ సహా మానవ జన్యుక్రమంలోనూ ఇది ఉన్నట్లు తెలిపారు.
ఈ పరివర్తనం వల్లే ఎక్కువగా వ్యాప్తి చెందే గుణాన్ని ఒమిక్రాన్ పొంది ఉండే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే లక్షణాలు, వ్యాధి తీవ్రత మాత్రం స్వల్పంగానే ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఒమిక్రాన్ వల్ల తలెత్తుతున్న లక్షణాలు, వాటి తీవ్రతను నిర్ధారించే సమాచారమేదీ అందుబాటులో లేదు.
‘‘ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికాలో హెచ్ఐవీ రేటు కూడా ఎక్కువే. హెచ్ఐవీ వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడి జలుబు సహా ఇతర ఇన్ఫెక్షన్లు సోకి ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతంలోనే రీకాంబినేషన్లు చోటుచేసుకొని ఒమిక్రాన్ జనించి ఉంటుంది. కొత్త వేరియంట్ల పుట్టుక వ్యాక్సిన్ల ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి’’ అని సౌందరరాజన్ తెలిపారు.
ఒమిక్రాన్ను అర్థం చేసుకోవడానికి మరింత నిర్దిష్టమైన, లోతైన అధ్యయనాలు జరగాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్ ఎలుకల్లో పరివర్తనం చెంది ఉంటుందన్న వాదన కూడా ప్రాచుర్యంలో ఉండడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.