Peace talks: ఆ షరతుకు అంగీకరిస్తేనే.. నక్సల్స్తో శాంతి చర్చలు: సీఎం బఘేల్
తమ ప్రభుత్వంతో షరతులతో కూడిన చర్చలకు మావోయిస్టులు సుముఖత వ్యక్తంచేసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. సుక్మా జిల్లాలో పర్యటనలో భాగంగా గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.......
రాయ్పూర్: నక్సల్తో శాంతి చర్చలు అంశంపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం పట్ల నక్సల్స్ విశ్వాసం ప్రకటిస్తేనే శాంతి చర్చలు జరుగుతాయన్నారు. తమ ప్రభుత్వంతో షరతులతో కూడిన చర్చలకు మావోయిస్టులు సుముఖత వ్యక్తంచేసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. సుక్మా జిల్లాలో పర్యటనలో భాగంగా గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వంతో చర్చలకు మావోయిస్టులు పేర్కొన్న షరతుల విషయాన్ని విలేకర్లు ప్రస్తావించగా.. చర్చలకు బస్తర్ కంటే మంచి ప్రదేశం ఏమీ లేదని సీఎం వ్యాఖ్యానించారు. ‘ఛత్తీస్గఢ్లో నక్సలిజం మొదలైందే సుక్మా ప్రాంతంలో. ఇక్కడి నుంచే వారి తిరోగమనం కూడా జరుగుతోంది. నక్సల్స్ ప్రభావం క్షీణిస్తోంది. వారు చర్చలు జరపాలనుకుంటే.. మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కానీ ఒక షరతు. రాజ్యాంగం పట్ల నక్సల్స్ విశ్వాసం ప్రకటిస్తేనే చర్చలు జరుగుతాయి’’ అని బఘేల్ తేల్చి చెప్పారు.
‘‘వారితో నేను ఏ ప్రాతిపదికన చర్చలు జరపాలి? భారతదేశం ఫెడరల్ రిపబ్లిక్. ఒక రాష్ట్రానికి సీఎంగా నేను ఎవరితోనైనా ముఖాముఖిగా మాట్లాడితే.. అవతలి వ్యక్తి రాజ్యాంగంపై నమ్మకం కలిగి ఉండటం అత్యంత ముఖ్యమైన అంశం. వారు భారత రాజ్యాంగాన్ని విశ్వసించకపోతే నేను చర్చలు జరపలేను. సుక్మా అయినా ఇంకెక్కడైనా చర్చలకు రెడీ.. కానీ రాజ్యాంగం పట్ల విశ్వాసం ప్రకటిస్తేనే..’’ అని తెలిపారు.
ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ఇటీవల మావోయిస్టులు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, ఇందుకు కొన్ని షరతులు పెట్టారు. జైళ్లలో ఉన్న తమ నేతలను విడుదల చేయడంతో పాటు కొన్ని ప్రాంతాల నుంచి భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. అయితే, దీనిపై ఛత్తీస్గఢ్ హోంమంత్రి తామరద్వాజ్ సాహు స్పందిస్తూ .. భేషరతుగా చర్చలు జరుపుతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు