దేశీ యాప్ ‘కూ’లో పీయూష్ గోయల్
విదేశీ సోషల్మీడియా వేదిక ట్విటర్కు పోటీగా తీసుకొచ్చిన యాప్ ‘కూ’లో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చేరారు. ఈ విషయాన్ని గోయల్ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. భారతీయ
దిల్లీ: విదేశీ సోషల్మీడియా వేదిక ట్విటర్కు పోటీగా తీసుకొచ్చిన యాప్ ‘కూ’లో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చేరారు. ఈ విషయాన్ని గోయల్ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. భారతీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ‘కూ’లో తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. తన శాఖలకు సంబంధించి అప్డేట్లను ఎప్పటికప్పుడు ఈ యాప్లో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
గతేడాది మార్చిలో విడుదల చేసిన ‘కూ’ యాప్.. ఆత్మనిర్భర్ సోషల్ మీడియా విభాగంలో ఉత్తమ దేశీ యాప్గా అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మన్కీబాత్లోనూ ఈ యాప్ గురించి ప్రస్తావించారు. ట్విటర్ తరహాలోనే ఇందులో దేశీయ భాషల్లో నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడింవచ్చు. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒరియా, పంజాబీ, అసోమీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, హిందీ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.
ఇప్పటికే కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు ఈ యాప్లో ఖాతాలు ఉన్నాయి. వీరితో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాలు, ఇండియా పోస్ట్; మై గవర్నమెంట్ ఇండియా, డిజిటిల్ ఇండియాలు కూడా ‘కూ’ యాప్లో అందుబాటులో ఉన్నాయి. కాగా.. రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ట్విటర్ మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న వేళ.. గోయల్ ‘కూ’ ఖాతా తెరవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదీ చదవండి..
చాలా వస్తున్నాయ్.. వెయిట్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.