Modi: దేశ ప్రజలకు ప్రధాని దీపావళి శుభాకాంక్షలు!

దీపావళి పండగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘దీపావళి శుభ సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు. ఈ దీపాల పండగ మీ జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు. ఈ పర్వదినంలో

Updated : 04 Nov 2021 11:54 IST

దిల్లీ: దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘దీపావళి శుభ సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు. ఈ దీపాల పండగ మీ జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు. నేడు ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్నారు. నౌషేరా, రాజౌరీ సెక్టార్లకు వెళ్లి అక్కడి సైనికులతో దీపావళి జరపుకోనున్నట్లు సమాచారం. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సైనికులతో కలిసి ఈ పండగ జరుపుకుంటున్నారు. ఆ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు