Corona: ఊరటనిచ్చే ‘పాజిటివ్’ న్యూస్!
శంలో కల్లోలం రేపిన కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ఈ రోజు దేశవ్యాప్తంగా లక్ష కన్నాతక్కువ కేసులే నమోదయ్యాయి. కొత్త కేసులు తగ్గి రికవరీలు.......
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కల్లోలం రేపిన కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ఈ రోజు దేశవ్యాప్తంగా లక్ష కన్నాతక్కువ కేసులే నమోదయ్యాయి. కొత్త కేసులు తగ్గి రికవరీలు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ నిబంధనల్ని సడలిస్తున్నాయి. థర్డ్వేవ్లో ఈ వైరస్ ముప్పు చిన్నారులకు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్పై ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. కరోనా కష్టకాలంలో ఊరటనిచ్చే కొన్ని వార్తలు మీకోసం..
👍 దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గుతోంది. రోజువారీ కేసులు 63రోజుల కనిష్ఠానికి చేరాయి. సోమవారం 18.7లక్షల మందికి పైగా టెస్ట్ చేయగా.. 86వేల కేసులు వచ్చాయి. అలాగే, ఒక్కరోజే 33.6లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఏప్రిల్ 3 తర్వాత అత్యల్పంగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. 322 జిల్లాల్లో నెల నుంచి కేసులు తగ్గుదల కనబడుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో రికవరీ రేటు 94.3శాతం గా ఉంది. 15 రాష్ట్రాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 5శాతం కంటే దిగువనే ఉండగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 4.62శాతంగా ఉంది. కేసుల్లో గత వారం 33శాతం క్షీణత కనిపించింది. 209 జిల్లాల్లో 100 చొప్పున రోజువారీ కేసులు నమోదవుతున్నట్టు కేంద్రం తెలిపింది.
👍 థర్డ్ వేవ్లో కరోనా వైరస్ ప్రభావం చిన్నారులపై అధికంగా ఉంటుందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాల్లేవని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా అన్నారు. సెకండ్ వేవ్లో కొవిడ్ సోకిన పిల్లల్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పారు. మున్ముందు కరోనా తీవ్రత చిన్నారులపై అధికంగా ఉంటుందని తాము భావించడం లేదన్నారు.
👍 కరోనా రోగులు త్వరగా కోలుకొనేందుకు తాము రూపొందించిన 2-డీజీ ఔషధం ఉపయుక్తంగా ఉంటుందని డీఆర్డీవో ఛైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. మధ్యస్థ, తీవ్ర లక్షణాలు ఉన్న రోగులకే ఇది వాడాలని, తద్వారా ఆక్సిజన్ అవసరం బాగా తగ్గుతుందన్నారు. జులై చివరి నాటికి 850 ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మిస్తామని చెప్పారు. డీఆర్డీవో రూపొందించిన 2డీజీ ఔషధంపై ఎఫ్టీసీసీఐ, డాక్టర్ రెడ్డీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్లో ఆయన మాట్లాడారు.
👍 దేశవ్యాప్తంగా 18ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని ప్రకటించిన కేంద్రం భారీగా టీకాల తయారీ కోసం ఆర్డర్లు ఇచ్చింది. మొత్తం 44 కోట్ల డోసుల తయారీ కోసం (కొవిషీల్డ్ 25కోట్లు; కొవాగ్జిన్ 19కోట్ల డోసులు) ఆర్డర్లు ఇచ్చినట్టు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మంగళవారం వెల్లడించారు. ఇప్పటికే బయోలాజికల్-ఇ సంస్థకు 30 కోట్ల డోసులకు కేంద్రం ఆర్డర్ చేసిన విషయం తెలిసిందే.
👍 తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,33,134 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,897 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా 15 మంది మరణించినట్టు రాష్ట్ర వైద్యశాఖ బులిటెన్లో వెల్లడించింది.
👍 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 1.19కోట్ల టీకా డోసులు పంపిణీకి సిద్ధంగా అందుబాటులో ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు 24కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు పంపిణీ చేయగా.. వీటిలో 23.47కోట్ల డోసులు వినియోగం (వృథాతో కలిపి) జరిగినట్టు తెలిపింది. ప్రస్తుతం 1,19,46,925 డోసులు రాష్ట్రాల వద్ద ఉన్నట్టు వెల్లడించింది.
👍 కరోనా కష్టకాలంలో అవస్థలు పడుతున్న వీధి వ్యాపారుల కోసం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కరోనా సహాయ ప్యాకేజీని ప్రకటించారు. రూ.26కోట్లతో ప్రకటించిన ఈ ప్యాకేజీతో 87,657మంది వీధివ్యాపారులు లబ్ధి పొందనున్నారు.
👍 థర్డ్ వేవ్ చిన్నారులకు ఎక్కువ ముప్పు ఉందంటూ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల లోపు వయసు కలిగిన పిల్లలు ఉన్న తల్లులను గుర్తించి వారికి ప్రాధాన్య క్రమంలో టీకా వేయించాలని నిర్ణయించింది. అర్హులైనవారి జాబితాను గ్రామాల వారీగా తయారు చేయాలని అధికారులను వైద్యశాఖ ఆదేశించింది. లబ్దిదారులను ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు లబ్ధిదారులను గుర్తించి ఆయా వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు తీసుకురావాలని సూచించింది.
👍 కరోనా నివారణకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, జమ్మూకశ్మీర్లోని ఓ కుగ్రామంలో ప్రతిఒక్కరూ టీకా వేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు. బందిపొరాలోని వేయాన్ గ్రామం దేశంలోనే 18 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ టీకా వేసుకున్న తొలి గ్రామంగా నిలిచింది. ఈ గ్రామంలో 18 ఏళ్లు దాటిన వారు 362మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు.
👍 మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కొవిడ్ కర్ఫ్యూని పొడిగించింది. ఈ నెల 15వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ స్పష్టంచేశారు. మరోవైపు, యూపీలోని అన్ని జిల్లాల్లో కొవిడ్ కర్ఫ్యూని ఎత్తివేశారు. అయితే, రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు నైట్ కర్ఫ్యూమాత్రం కొనసాగుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి
పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ (సీపీఐ) కోరారు. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది. -
కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. -
నేడు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. -
డాక్యుమెంట్లపై అసంతృప్తి.. భారతీయులను తిరిగి దుబాయ్కు పంపిన జమైకా
జమైకాలో పర్యటించేందుకు వెళ్లిన కొందరు భారతీయులకు చుక్కెదురైంది. దుబాయ్ నుంచి ఛార్టర్డ్ విమానంలో జమైకా రాజధాని కింగ్స్టన్ను చేరుకున్న భారతీయుల డాక్యుమెంట్లను పరిశీలించిన స్థానిక అధికారులు తృప్తి చెందక పోవడంతో వారిని తిరిగి పంపించారు. -
కిక్కిరిసిపోతున్న కారాగారాలకు బహిరంగ జైళ్లే పరిష్కారం: సుప్రీం కోర్టు
దేశంలో కిక్కిరిసిపోతున్న కారాగారాల సమస్యల పరిష్కారానికి బహిరంగ జైళ్లే పరిష్కారమని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. -
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్