‘వాక్ స్వేచ్ఛ’పై అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యలు.. భాజపా, టీఎంసీ ట్విటర్ వార్
సాధారణంగా వివాదాలకు చాలా దూరంగా ఉండే ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan).. బెంగాల్లో రాజకీయ దుమారానికి కేంద్ర బిందువయ్యారు. ‘పఠాన్’ సినిమా వివాదం వేళ.. భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆయన మాట్లాడటమే అందుకు కారణం.
కోల్కతా: దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. ‘పఠాన్ (Pathaan)’ సినిమాపై వివాదం జరుగుతున్న వేళ అమితాబ్ ‘వాక్ స్వాతంత్ర్యం’ పై మాట్లాడటం.. తృణమూల్ కాంగ్రెస్ (TMC), భాజపా (BJP) నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇంతకీ బిగ్బీ ఏమన్నారు..? ఆ వ్యాఖ్యలు ఎందుకు వివాదాస్పదమయ్యాయి? అంటే..
పశ్చిమ బెంగాల్లో కోల్కతా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ (Shah Rukh Khan) పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే బిగ్బీ ఈ వేడుకలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ పౌర హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ (Freedom of Expression)పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి’’ అన్నారు. షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రంపై వివాదం జరుగుతున్న వేళ.. అమితాబ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారానికి దారితీసింది.
బిగ్బీ వ్యాఖ్యలపై భాజపా ఐటీ విభాగం హెడ్ అమిత్ మాల్వియా ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘కోల్కతాలో మమతా బెనర్జీ వేదికపై ఉండగా.. అమితాబ్ బచ్చన్ మాటలు మరింత ప్రవచనాత్మకంగా ఉండవు. నిరంకుశులకు(మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ) అద్దం పట్టినట్లుగానే ఉంటాయి’’ అని విమర్శించారు. ఆ నిరంకుశురాలి(మమత) నాయకత్వంలో ఈ దేశం ఎన్నికల అనంతరం ఘోరమైన హింసను చవిచూసిందని మండిపడ్డారు. బెంగాల్ ప్రతిష్ఠను ఆమె దిగజారుస్తున్నారని ఆరోపించారు.
కాగా.. అమిత్ మాల్వియా ట్వీట్కు తృణమూల్ ఎంపీ నుశ్రత్ జహాన్ (Nussrat Jahan) గట్టిగా బదులిచ్చారు. ‘‘సినిమాలపై నిషేధం విధించడం, జర్నలిస్టులను నిర్బంధించడం, నిజం మాట్లాడినందుకు సామాన్యులను శిక్షించడం.. ఇవే నిరంకుశ పాలన సంకేతాలు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై పరిమితులు విధించడం కూడా ఆ పాలనకు నిదర్శనమే. ఇదంతా భాజపా హయాంలోనే జరుగుతోంది. కానీ, అమిత్ మాల్వియా మాత్రం ఇతరులను నిందించడంలో బిజీగా ఉన్నారు’’ అంటూ నుశ్రత్ కౌంటర్ ఇచ్చారు.
షారుక్, దీపికా పదుకొణె (Deepika Padukone) నటించిన ‘పఠాన్’ సినిమాకు బాయ్కాట్ సెగ తగిలిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన ‘బేషరమ్ రంగ్’ (besharam rang) పాటలో దీపిక ధరించిన దుస్తులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ భాజపా నేతలతో పాటు పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ సినిమాను నిషేధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై కోల్కతా ఫిలిం ఫెస్టివల్లో షారుక్ పరోక్షంగా స్పందించారు. సామాజిక మాధ్యమాలు తరచూ సంకుచిత పోకడలతో విభజన కారక, విధ్వంసక పాత్ర పోషిస్తున్నాయని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?