Lockdown in Sri Lanka: శ్రీలంకలో దేశవ్యాప్తంగా లాక్డౌన్..!
కరోనా వైరస్ మహమ్మారి మూడో ఉద్ధృతి దాటికి శ్రీలంక వణికిపోతోంది. వైరస్ ఉద్ధృతిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ నియంత్రణలోకి రాలేదు. దీంతో దేశవ్యాప్తంగా పదిరోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.
థర్డ్వేవ్ విజృంభణతో మరోసారి ఆంక్షలు
కొలంబో: కరోనా వైరస్ మహమ్మారి మూడో దశ ఉద్ధృతి దాటికి శ్రీలంక వణికిపోతోంది. వైరస్ ఉద్ధృతిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ నియంత్రణలోకి రాలేదు. దీంతో దేశవ్యాప్తంగా పదిరోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం రాత్రి నుంచి ఆగస్టు 30వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది.
గతకొన్ని రోజులుగా శ్రీలంకలో నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆస్పత్రుల్లో చేరికలు పెరిగిపోయాయి. కేవలం గురువారం ఒక్కరోజే దాదాపు 4వేల కేసులు, 186 మరణాలు రికార్డయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం, శ్రీలంకలో ఇప్పటివరకు 3లక్షల 73వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా, 6790 మంది మృత్యువాతపడ్డారు. కొలంబోలో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. జూన్ తర్వాత పెరిగిన ఉద్ధృతితో మరణాల సంఖ్య పెరిగింది. దీంతో మార్చురీలు, శ్మశానవాటికలు నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మూడో ఉద్ధృతికి అడ్డుకట్ట వేయాలని వైద్య నిపుణులతో పాటు బౌద్ధ మతాధికారుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో పదిరోజుల పాటు లాక్డౌన్ విధించాలని శీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ఆదేశించారు. దీంతో ఆగస్టు 20వ తేదీ రాత్రి పది గంటల నుంచి ఆగస్టు 30 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు అమలులో ఉంటాయని జాతీయ కొవిడ్ నిర్మూలన కేంద్రానికి నేతృత్వం వహిస్తోన్న ఆర్మీ చీఫ్ జనరల్ శవేంద్ర సిల్వ వెల్లడించారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభణతో ఆస్పత్రులు, మార్చురీలు, శ్మశాన వాటికలు కిటకిటలాడుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొన్నప్పటికీ అధ్యక్షుడు గోటబాయ మాత్రం కఠిన చర్యలకు నిరాకరించారు. ముఖ్యంగా లాక్డౌన్ విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. కొవిడ్ మహమ్మారి ప్రభావంతో దేశంలో రోజురోజుకి ఆరోగ్య వ్యవస్థ మరింత దిగజారిపోతుందని కూటమి సభ్యులతో పాటు అక్కడ అత్యంత శక్తివంతమైన బౌద్ధ మతాధికారుల నుంచి ఆందోళన వ్యక్తం అయ్యింది. వీటిని కట్టడి చేసేందుకు మరోసారి లాక్డౌన్ విధించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో తప్పని పరిస్థితుల్లో శ్రీలంక అధ్యక్షుడు లాక్డౌన్కు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
ఇదిలాఉంటే, కరోనా వైరస్ను కట్టడి చేయడంలో భాగంగా శ్రీలంక ఇప్పటికే పలుమార్లు కర్ఫ్యూ ఆంక్షలు, లాక్డౌన్ విధించింది. ఇలా వరుస ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా పర్యాటక రంగం నుంచి ప్రధాన ఆదాయం పొందే శ్రీలంక, కొవిడ్ ఆంక్షల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?