Didi Vs HM: మదర్ థెరీసా ఛారిటీ వివాదం.. దీదీ వ్యాఖ్యలకు హోంశాఖ కౌంటర్!
మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి చెందిన అకౌంట్లను ఫ్రీజ్ చేయలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
దిల్లీ: మదర్ థెరీసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి చెందిన బ్యాంకు అకౌంట్లను కేంద్రం నిలిపివేయడం దారుణమని మమతా బెనర్జీ ఆరోపించారు. దీంతో వేలమంది రోగులతో పాటు సంస్థ సిబ్బందికి ఆహారం, ఔషధాలు అందకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీదీ ఆరోపణలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెంటనే స్పందించింది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి చెందిన అకౌంట్లను ఫ్రీజ్ చేయలేదని స్పష్టం చేసింది. ఆయా బ్యాంకు అకౌంట్లను నిలిపివేయాలని కోరుతూ ఆ సంస్థనే ఎస్బీఐకి లేఖ రాసినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో తమ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలేమీ నిలిచిపోలేదని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ చెప్పడం గమనార్హం.
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) కింద సంస్థ లైసెన్సు రెన్యువల్ కోసం మదర్ థెరీసా నెలకొల్పిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. అయితే, వాటిని పరిశీలించిన ప్రభుత్వం.. రెన్యువల్ చేసేందుకు నిరాకరించింది. సంస్థపై పలు ఫిర్యాదులు రావడంతోపాటు ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా లేకపోవడంతో డిసెంబర్ 25న రిజిస్ట్రేషన్ రెన్యువల్ను తిరస్కరించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అనంతరం తిరస్కరణను సమీక్షించాలని కానీ, మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థన ఆ సంస్థ నుంచి ఇప్పటికీ రాలేదని పేర్కొంది. అంతేకాకుండా అక్టోబర్ 31కే లైసెన్స్ ముగిసినప్పటికీ డిసెంబర్ 31వరకూ ఆ సంస్థ రిజిస్ట్రేషన్కు పొడిగించిన విషయాన్ని కేంద్ర హోంశాఖ గుర్తుచేసింది. ఇదే సమయంలో తమ అకౌంట్లను నిలిపివేయాలంటూ ఛారిటీనే ఎస్బీఐని కోరినట్లు స్పష్టం చేసింది.
క్రిస్మస్ రోజునే మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అకౌంట్లను కేంద్రం ఫ్రీజ్ చేశారనే విషయం తననెంతో షాక్కు గురిచేసిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. దీంతో 22 వేలమంది రోగులు, ఉద్యోగుల ఆహారం, ఔషధాలకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టమే ప్రధానమైనప్పటికీ మనవతా ప్రయత్నాల్లో రాజీ పడకూడదంటూ ట్వీట్ చేశారు. దీనికి బదులిచ్చిన కేంద్ర హోంశాఖ.. బ్యాంకు ఖాతాలేమీ నిలిపివేయలేదని స్పష్టం చేసింది. అయితే, ఛారిటీకి చెందిన బ్యాంకు అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేశారని మమతా బెనర్జీ ఆరోపించడంపై అటు మదర్ థెరీసా ఛారిటీ స్పందించింది. ప్రస్తుతం అకౌంట్లన్నీ బాగానే పనిచేస్తున్నాయని సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదని.. ప్రస్తుతానికి బ్యాంకు లావాదేవీలు సజావుగానే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్