Nawab Malik: సినిమా ఇంకా అయిపోలేదు..!
క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో ఆర్యన్ఖాన్ అరెస్టు, అప్పటినుంచి మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేస్తోన్న సంచలన ఆరోపణలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే నిన్న బాంబే హైకోర్టు ఆర్యన్కు బెయిల్ మంజూరు చేయగా.. ఆ వెంటనే ‘సినిమా ఇంకా అయిపోలేదు’ అంటూ మాలిక్ ట్వీట్ చేశారు. ఈ కేసు గురించి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ఈ డ్రగ్స్ కేసు ముంబయి నుంచి బాలీవుడ్ను తరలించేందుకు భాజపా చేసిన కుట్రని తీవ్రంగా మండిపడ్డారు.
బాలీవుడ్ను తరలించేందుకు భాజపా చేసిన కుట్ర : నవాబ్ మాలిక్
ముంబయి: క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు, అప్పటినుంచి మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేస్తోన్న సంచలన ఆరోపణలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నిన్న బాంబే హైకోర్టు ఆర్యన్కు బెయిల్ మంజూరు చేయగా.. ఆ వెంటనే ‘సినిమా ఇంకా అయిపోలేదు’ అంటూ మాలిక్ ట్వీట్ చేశారు. ఈ కేసు గురించి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ముంబయి నుంచి బాలీవుడ్ను తరలించేందుకు భాజపా చేసిన కుట్రగా ఈ డ్రగ్స్ కేసును ఆయన అభివర్ణించారు.
‘ఈ క్రూయిజ్ డ్రగ్స్ కేసు.. ముంబయి నుంచి బాలీవుడ్ను తరలించేందుకు భాజపా పన్నిన పన్నాగం. బాలీవుడ్ను మసకబార్చేందుకు ఆ పార్టీ చేసిన కుట్ర’ అని మాలిక్ ప్రతిపక్ష భాజపాపై తీవ్రంగా మండిపడ్డారు. అలాగే సమీర్ వాంఖడేపై మరోసారి ఆరోపణలు చేశారు. ‘పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆర్యన్ ఖాన్ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకువచ్చిన ఆ వ్యక్తి(కిరణ్ గోసావి) ఇప్పుడు జైలు పాలయ్యారు. ఆర్యన్, ఇతరులకు బెయిల్ రాకుండా అన్ని ప్రయత్నాలు చేసిన వ్యక్తి (సమీర్ వాంఖడే) ఇప్పుడు కోర్టు మెట్లెక్కారు. ముంబయి పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు. తనకు రక్షణ కల్పించాలని గతవారం ముంబయి పోలీసుల్ని కోరారు. ఆయన ఏదో తప్పు చేశారు.. అందుకే ఇంతగా భయపడుతున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు. ‘నా పోరాటం వ్యక్తిగతమైంది కాదు. అన్నింటికీ సాక్ష్యాలు ఉన్నాయి’ అని అన్నారు. అంతేగాకుండా పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఎన్సీబీ అధికారి నుంచి తనకు ఒక లేఖ అందిందని, బాధ్యతాయుతమైన పౌరుడిగా దాన్ని పంపుతున్నట్లు ఎన్సీబీకి వెల్లడించారు.
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు తర్వాత అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆర్యన్ విడుదలకు అతడి తండ్రి షారుక్ ఖాన్ నుంచి రూ.25 కోట్లు డిమాండ్ చేశారని, వాటిలో రూ.8 కోట్లు వాంఖడేకు వెళ్తాయని ఈ కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క మంత్రి ఆ అధికారికి సంబంధించిన పలు వివరాలు నెట్టింట్లో పోస్టు చేస్తూ.. ఆరోపణల్ని తీవ్రతరం చేశారు. దాంతో ఎన్సీబీ వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు పై అధికారులతో సమీర్పై విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. నిన్న బాంబే హైకోర్టు ఆర్యన్కు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ‘సినిమా ఇంకా అయిపోలేదు’ అంటూ మాలిక్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
ఆర్యన్ ఈ రోజు విడుదల కావొచ్చు..‘ఈ రోజు సాయంత్రం హైకోర్టు నుంచి ఆదేశాలు అందే అవకాశం ఉంది. ఆ వెంటనే మేం వాటిని ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించనున్నాం. దాంతో ఆర్యన్ విడుదలకు కావాల్సిన ఉత్తర్వులు పొందునున్నాం’ అని ఈ కేసులో ఆర్యన్ తరఫు న్యాయవాది మీడియాకు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు