Twitter: కోహ్లీ చెప్పిన శుభవార్త, పాట్ కమిన్స్ విరాళం.. భారతీయుల్ని మెప్పించాయి..!
ఈ డిజిటల్ యుగంలో నెట్టింటికే అత్యధిక ప్రాధాన్యం. ప్రభుత్వాలు, అభిమాన నటులు, ఆటగాళ్లు.. ఇలా ఎవరు ఏ కొత్త విషయం చెప్పినా వెంటనే నెటిజన్లకు చేరిపోతుంది.
అత్యధిక రీట్వీట్లు, లైక్స్ పొందిన ట్వీట్లు ఏంటో తెలుసా..?
దిల్లీ: ఈ డిజిటల్ యుగంలో నెట్టింటికే అత్యధిక ప్రాధాన్యం. ప్రభుత్వాలు, అభిమాన నటులు, ఆటగాళ్లు.. ఇలా ఎవరు ఏ కొత్త విషయం చెప్పినా వెంటనే నెటిజన్లకు చేరిపోతుంది. వారిని మెప్పిస్తే ట్రెండ్ అవుతుంది. ట్వీట్ల సంగతి అంతే. అందుకే.. 2021లో భారతీయులు ఎక్కువగా రీట్వీట్ చేసిన ట్వీట్, వారిని ఆకట్టుకున్న ట్వీట్, ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్స్ను ట్విటర్ వెల్లడించింది. అంతగా నెటిజన్లను ఆకట్టుకున్న అంశాలు, చర్చించిన విషయాలు ఏంటో తెలియాలంటే ట్విటర్ చెప్పిన వివరాలు చదవాల్సిందే..!
పాట్ కమిన్స్ ట్వీట్కు భారత్లో ఎక్కువ రీట్వీట్లు:
భారత్ కరోనా రెండో దశలో తీవ్రంగా అల్లాడిపోయింది. ఆ సమయంలో ఎంతోమంది ప్రముఖులు ముందుకు వచ్చి, ఆపత్కాలంలో అండగా నిలిచారు. ఆక్సిజన్ కొరతతో సతమతమయిన భారత్కు ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్ కమిన్స్ పీఎం కేర్స్కు 50 వేల డాలర్లు విరాళంగా ప్రకటించారు. ఆ సందర్భంగా పెట్టిన ట్వీట్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ‘భారత్.. ఏళ్లుగా నేను ప్రేమిస్తూ వస్తున్న దేశం. నేను ఇప్పటివరకు చూసిన వాళ్లలో అత్యంత దయ, మంచి మనసు కలిగినవారు ఇక్కడి ప్రజలు. అలాంటి వారు ఇప్పుడు బాధలో ఉన్నారని తెలియడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది’ అంటూ మనదేశంపై తన ప్రేమను చాటాడు. తన ఆటతో భారతీయుల అభిమానాన్ని పొందిన కమిన్స్.. దాతృత్వంలోనూ వారి ప్రేమకు పాత్రుడయ్యాడు. కమిన్స్ చేసిన ట్వీట్ భారత్లో అత్యధికంగా రీట్వీట్ చేసిన ట్వీట్గా నిలిచింది. అది 1,14,000 సార్లు రీట్వీట్ అయింది.
కోహ్లీ శుభవార్తకు లైక్స్ వర్షం..
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో వెలకట్టలేని అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ట్విటర్లో తనకు కుమార్తె జన్మించిన విషయాన్ని వెల్లడించి, అభిమానులకు శుభవార్త చెప్పారు. దానిపై నెటిజన్లు లైక్స్ వర్షం కురిపించారు. 5,38,200 లైక్స్తో 2021లో అత్యధికంగా ఇష్టపడిన ట్వీట్గా నిలిచింది. మరోవిషయం ఏంటంటే.. కోహ్లీ గతేడాది తన భార్య అనుష్క శర్మ గర్భం దాల్చిన విషయాన్ని ట్విటర్లో పంచుకోగా.. దానికే 2020లో అత్యధికులు లైక్ కొట్టారు.
ప్రభుత్వంలో మోదీ ట్వీట్లదే హవా..
ఈ ఏడాది మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా మొదటి డోసును స్వీకరించారు. దేశంలో అర్హులంతా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఆ చిత్రాన్ని ఆయన ట్విటర్లో షేర్ చేశారు. అది ఎంతో మందికి చేరువైంది. అందుకే ప్రభుత్వానికి సంబంధించి అత్యధికులు రీట్వీట్ చేసిన ట్వీట్గా మారింది. ఇప్పటివరకు దాన్ని 45,100 మంది రీట్వీట్ చేశారు. అలాగే టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియాపై గబ్బా స్టేడియంలో భారత్ సాధించిన విజయంపై మోదీ స్పందించారు. ఈ విజయం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటూ టీమిండియాకు అభినందనలు తెలిపారు. ఇది కూడా ప్రభుత్వానికి సంబంధించి ఎక్కువమంది ఇష్టపడిన ట్వీట్. దీనిని 2,98,000 మంది లైక్ చేశారు.
బిజినెస్ రంగంలో మెప్పించిన ట్వీట్ ఆయనదే..
ఈ ఏడాది విమానయాన సంస్థ ఎయిరిండియాను టాటా గ్రూప్ టేకోవర్ చేసుకోవడంపై వ్యాపార వర్గాలు అమితాసక్తిని ప్రదర్శించాయి. అందుకు తగట్టే దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఆ సంస్థ సొంత యజమానుల చెంతకు చేరింది. దీనిపై టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా స్పందిస్తూ.. ‘వెల్కమ్ బ్యాక్ ఎయిరిండియా’ అని ట్వీట్ చేశారు. ఇదే ఈ ఏడాది బిజినెస్ రంగంలో అత్యధికులు రీట్వీట్, లైక్ చేసిన ట్వీట్.
> తమిళ స్టార్ నటుడు విజయ్ తన తదుపరి చిత్రం బీస్ట్కు సంబంధించిన ఫస్ట్ లుక్పై ట్వీట్ చేశారు. వినోద రంగంలో దానికే అత్యధిక రీట్వీట్లు, లైక్స్ దక్కాయి.
> ఐపీఎల్లో క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఆటను అభినందిస్తూ విరాట్ చేసిన ట్వీట్ .. క్రీడా విభాగంలో అత్యధిక రీట్వీట్లు, లైక్స్ దక్కించుకుంది.
హ్యాష్ ట్యాగ్లు, ఎమోజీలు ఇవే..
COVID19, FarmersProtest, TeamIndia, Tokyo2020, IndianArmy, Uttarakhand, Bitcoin, NFT వంటి తదితర హ్యాష్ ట్యాగ్లు విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. అలాగే ఫోల్డెడ్ హ్యాండ్ ఎమోజీని ఎక్కువ మంది వాడగా.. ఆ తర్వాత లవ్, ఫైర్ ఎమోజీలను నెటిజన్లు తమ సందేశాల్లో ఉపయోగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్