Immunity boosting: మళ్లీ కరోనా కలకలం.. ఈ ఫుడ్తో మీ ఇమ్యూనిటీకి భలే బూస్ట్!
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ భయాందోళన అవసరం లేదని.. తగిన జాగ్రత్తలతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా(corona virus) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో మరోసారి కలకలం రేగుతోంది. ఈ వైరస్బారిన పడిన వారి సంఖ్య ఇటీవలి కాలంలో రోజురోజుకీ పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే అమాంతం 40శాతం మేర కేసులు పెరిగి దేశవ్యాప్తంగా 3,016 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, కరోనా వైరస్ మనల్ని ఇంకా వెంటాడుతున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏమీకాదని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, మనం శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నారు. అందుకోసం తగిన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇమ్యూనిటీ(Immunity)ని సహజంగా పెంచుకొనేందుకు రోజూమీరు తీసుకొనే ఆహారంలో వీటిని యాడ్ చేసుకుంటే భలే బూస్ట్ అంటున్నారు.
- కరోనా వైరస్ మన దరి చేరనీయకుండా ఉండాలంటే విటమిన్ సీ అవసరం. ఎక్కువగా పండ్లు తినడం వల్ల తగిన మోతాదులో సీ విటమిన్ లభ్యమవుతుంది. ఆరంజ్, నిమ్మ, ఉసిరి వంటి ఆహారం ఏడాది పాటు మనకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా కరోనాతో పాటు ఇతర వ్యాధులను సైతం సమర్థంగా ఎదుర్కొనేందుకు దోహదపడుతుంది.
- తాజా, ఆకుపచ్చని కూరగాయలు సాధారణంగానే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొవిడ్లాంటి వైరస్ను ఎదుర్కోవాలంటే మన డైట్లో నిత్యం ఆయా సీజన్లలో పండే ఆకుకూరలు ఉండేలా జాగ్రత్తపడాలి. ఆకుకూరలు, కూరగాయల్లో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర, మెంతికూర, సోయా వంటివి మన ఇమ్యూనిటీని పెంచడంలో సహకరిస్తాయి. అలాగే, మన శరీరానికి తగిన పోషకాలను అందిస్తాయి.
- ప్రొటీన్లు పుష్కలంగా లభించే కోడిమాంసం, చేపలు, గుడ్లు, పన్నీర్, సోయా, కాయధాన్యాలు, గింజలు తీసుకోవాలి.రోజూ శరీరానికి తగిన వ్యాయామం చేయడంతో పాటు శ్వాస సంబంధమైన టిప్స్ పాటిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
- రోజూ బెల్లం వినియోగించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో ఐరన్ శరీరానికి బలాన్నిస్తుంది. దీంతో పాటు నెయ్యి, పాలు, వెన్నలాంటివి మీ డైట్లో తగిన మోతాదులో ఉండేలా చూసుకున్నట్లయితే.. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
- పండ్లు కూరగాయలకు తోడు ఆయుర్వేదిక్ డికాక్షన్ తీసుకోవడం ద్వారా మీ ఇమ్యూనిటీ మరింతగా పెంచుకోవచ్చు. తులసి, దాల్చిన చెక్క, యాలకులు, వన్చలోచన్, ములేతి, తిప్పతీగ, బెల్లంతో తయారుచేసిన కషాయం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతోంది. దీంట్లో ఉండే ఔషధ గుణాలు ఊపిరితిత్తుల పనితీరును మరింత మెరుగుపరుస్తూ శరీరానికి కొత్త ఉత్తేజాన్ని అందిస్తాయి.
మరోవైపు, సీజనల్ ఫ్లూను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ పలు కీలక సూచనలు చేస్తోంది. ఈ ఫ్లూ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏం చేయాలి? ఏం చేయకూడదో జాగ్రత్తలను సూచిస్తూ ప్రత్యేక చార్ట్ను విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.