
Booker Prize: ‘టూంబ్ ఆఫ్ సాండ్’ భారతీయ నవలకు ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్
ఈ ఘనత సాధించిన తొలి హిందీ నవల
దిల్లీ: భారతీయ రచయిత్రి గీతాంజలిశ్రీని అంతర్జాతీయ పురస్కారం బుకర్ ప్రైజ్ వరించింది. ఆమె రచించిన ‘టూంబ్ ఆఫ్ సాండ్’కు ఈ ఘనత దక్కింది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కించుకున్న తొలి హిందీ నవల ఇది. రేత్ సమాధి పేరిట గీతాంజలి 2018లో ఈ నవలను రచించారు. తర్వాత అది ‘టూంబ్ ఆఫ్ సాండ్’గా ఆంగ్లంలోకి తర్జుమా అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులకు చేరువైన ఈ పుస్తకం 2022 ఏడాదికి గానూ అవార్డును పొందింది. దీనికింద 50 వేల పౌండ్ల నగదు బహుమతి లభించగా.. ఆంగ్ల అనువాదకురాలు డైసీ రాక్వెల్తో కలిసి గీతాంజలి ఈ మొత్తాన్ని పంచుకోనున్నారు.
ఈ రేత్ సమాధి వృత్తాంతం.. భర్తను కోల్పోయిన 80 ఏళ్ల వృద్ధురాలి చుట్టూ తిరుగుతుంది. భర్త మరణంతో కుంగిపోయిన ఆమె.. ఆ ప్రతికూల పరిస్థితులను దాటుకొని కొత్త జీవితాన్ని ప్రాంభించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె విభజన సమయంలో వదిలివచ్చిన గతాన్ని వెతుక్కుంటూ పాకిస్థాన్కు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఈ ప్రయాణాన్ని గీతాంజలి హృద్యంగా మలిచిన తీరు న్యాయనిర్ణేతలను మెప్పించింది.
గీతాంజలి ఉత్తర్ప్రదేశ్లో జన్మించారు. ఆమె చిన్నపిల్లల కథలు, రేత్ సమాధితో కలిపి ఐదు నవలలు రచించారు. ఈ పురస్కారం దక్కడంపై అమితమైన సంతోషం వ్యక్తం చేశారు. ‘బుకర్ ప్రైజ్ వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. దీనిని గెలుస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. ఇది గొప్ప గౌరవం’ అని స్పందించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Health: యోగా చేయండి.. జ్ఞాపక శక్తి పెంచుకోండి
-
Crime News
Crime News: శంషాబాద్ విమానాశ్రయంలో ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు
-
Crime News
Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
-
Viral-videos News
Viral Video: గోల్డ్ స్మగ్లింగ్కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!
-
Politics News
Revanth Reddy: మానవత్వం లేకుండా వెంకట్పై పోలీసులు దాడి చేశారు: రేవంత్రెడ్డి
-
India News
Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- Viral Video: గోల్డ్ స్మగ్లింగ్కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Mahesh babu: బిల్ గేట్స్తో మహేశ్బాబు.. పిక్ వైరల్.. ఎక్కడ కలిశారంటే?
- WhiteHat Jr: 300 మంది ఉద్యోగుల్ని తొలగించిన వైట్హ్యాట్