Kishan Reddy: విదేశాలకు తరలిన పురాతన వస్తువులను తెప్పించేందుకు కేంద్రం కట్టుబడి ఉంది: కిషన్రెడ్డి
భారత్ నుంచి ఇతర దేశాలకు అక్రమంగా తరలిన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే పురాతన వస్తువులను తిరిగి తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
దిల్లీ: గత పదేళ్లలో దేశంలోని ప్రముఖ కట్టడాలు, చిహ్నాలు, దేవాలయాల్లో ఉన్న 31 పురాతన వస్తువులు అపహరణకు గురయ్యాయయని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘‘2013-2023 వరకు భారత పురావస్తు శాఖ(ASI) ఆధ్వర్యంలోని రక్షణ ఉండే ప్రముఖ కట్టడాలు, స్మారక చిహ్నాలు, దేవాలయాలు తదితర వాటిల్లో 31 పురాతన వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. వాటిలో ఇంకా 27 వస్తువులను రికవరీ చేయాల్సి ఉంది. అయితే వీటికి సంబంధించి అక్రమ రవాణాపై సరైన సమాచారం లేదు’’ అని మంత్రి సమాధానమిచ్చారు.
భారత్ నుంచి ఇతర దేశాలకు అక్రమంగా తరలిన మన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే పురాతన వస్తువులను తిరిగి తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. ఇలాంటి పురాతన వస్తువులను ఇతర దేశాల్లో గుర్తిస్తే వెంటనే వాటిని భారత్కు తీసుకొచ్చేందుకు ఆయా దేశాలతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం పురాతత్వశాఖ విదేశాంగ శాఖ సహకారంతో ఆయా దేశాల్లోని భారత ఎంబసీలతో మాట్లాడి వాటిని వెనక్కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోందన్నారు. అలా 1976 నుంచి 2023 వరకు ఇతర దేశాలకు అక్రమంగా తరలిన మొత్తం 251 పురాతన వస్తువులను పురావస్తు శాఖ భారత్కు రప్పించిందని మంత్రి వివరించారు. ఇక 2021లో అమెరికా నుంచి 157, 2022లో ఆస్ట్రేలియా నుంచి 29 పురాతన వస్తువులను భారత్కు తీసుకొచ్చినట్లు చెప్పారు. దీనికి సంబంధించి ఆయన పూర్తి డేటాను విడుదల చేశారు.
చారిత్రక నేపథ్యమున్న కట్టడాలు, ఆలయాలకు అవసరాన్ని బట్టి భారత పురావస్తుశాఖతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలు, ప్రైవేట్ సెక్యూరిటీ రక్షణగా ఉంటున్నట్లు మంత్రి తెలిపారు. ఎప్పుడైనా పురాతన వస్తువు దొంగతనానికి గురైనట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అలా దొంగిలించిన వస్తువులను గుర్తించేందుకు, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కస్టమ్ శాఖ, ఇతర నిఘా సంస్థలకు లుక్ ఔట్ నోటీసులు ఇస్తున్నట్లు చెప్పారు. గత పదేళ్లలో దొంగతనానికి గురైన 31 పురాతన వస్తువుల్లో 14 కర్ణాటకలోని ప్రముఖ కట్టడాల నుంచే ఉన్నట్లు తెలిపారు. వాటిలో ఒకదాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!