J&K: ప్రభుత్వ ఉద్యోగుల ముసుగులో..!
సయ్యద్ సలాహుద్దీన్.. ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్. అతనో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. అతనికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
* ఉగ్రవాదులకు సాయం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
సయ్యద్ సలాహుద్దీన్.. ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. అతడికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక్క కుమారుడు తప్ప అందరూ జమ్ముకశ్మీర్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. 2016లో వీరిలో ఒక కుమారుడు పనిచేస్తున్న కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేస్తే.. భద్రతా బలగాలు ప్రాణాలకు తెగించి అందరితోపాటు అతడిని కూడా కాపాడాయి. తాజాగా సలాహుద్దీన్ సంతానంలో ఇద్దరు కుమారులు ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లు తేలింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగం నుంచి వారిని తొలగించారు.
జమ్ముకశ్మీర్ ప్రభుత్వం 11 మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేసింది. వీరిలో ఉగ్ర సంస్థ హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కుమారులిద్దరు ఉన్నారు. ఉగ్రవాదులకు కీలక సమాచారంతోపాటు వారి రవాణాకు అవసరమైన సహకారం అందించారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి. సలాహుద్దీన్ కుమారులైన సయ్యద్ అహ్మద్ షకీల్, షాహిద్ యూసఫ్లు ఉగ్రవాదులకు నిధులు సేకరించడం, హవాలా మార్గంలో పంపించడం వంటి పనులు చేస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఉద్యోగాల్లోంచి తొలగించిన 11 మందిలో నలుగురు జమ్ముకశ్మీర్ విద్యా శాఖలో, ఇద్దరు రాష్ట్ర పోలీస్ విభాగంలో, షేర్ ఈ కశ్మీరీ మెడికల్ సైన్సెస్, వ్యవసాయ శాఖ, స్కిల్ డెవలప్మెంట్, పవర్ అండ్ హెల్త్ విభాగాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
* పోలీసు శాఖలో పని చేస్తూ ఉగ్రవాదులకు సాయం చేసిన ఇద్దరూ బలగాల ఆపరేషన్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఉగ్రవాదులకు చేరవేశారు. వీరిలో అబ్దుల్ రషీద్ షిగన్ అనే వ్యక్తి భద్రతా దళాలపై దాడులు కూడా చేసినట్లు గుర్తించారు.
* వైద్య శాఖలో పనిచేస్తున్న నాజ్ ఎం. అల్లాయ్ అనే వ్యక్తి హిజ్బుల్కు క్షేత్రస్థాయి కార్యకర్తగా పని చేశాడు. అతడు గతంలో ఇద్దరు ఉగ్రవాదులకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు.
* విద్యాశాఖలో పని చేసే జబ్బార్ అహ్మద్ పరాయ, నాసిర్ అహ్మద్ తంత్రిలు పాకిస్థాన్, జమాత్ ఇ ఇస్లామ్ నుంచి నిధులు పొంది.. వేర్పాటువాద భావజాలాన్ని ప్రచారం చేశారు.
* విద్యుత్తు శాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న షహీన్ అహ్మద్ లోన్ అనే వ్యక్తి హిజ్బుల్ ముజాహిదీన్ కోసం ఆయుధాలను సరఫరా చేసినట్లు గుర్తించారు. అతను గతేడాది జనవరిలో శ్రీనగర్ నుంచి జమ్ముకు వెళ్లే జాతీయ రహదారిపై ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి ప్రయాణించినట్లు గుర్తించారు. ఆ సమయంలో వీరి వద్ద ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా ఉన్నట్లు తేలింది.
* కుప్వారాలో ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఒక ఉద్యోగిని తొలగించారు. అతను లష్కరే ఉగ్ర సంస్థకు భద్రతా దళాల కదలికలపై సమాచారం అందజేసినట్లు గుర్తించారు.
* దేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేస్తున్నట్లు అనంతనాగ్లో ఇద్దరు టీచర్లపై ఆరోపణలు వచ్చాయి.
2016లో ఉగ్రదాడి నుంచి కాపాడిన బలగాలు..
సలాహుద్దీన్ కుమారుల్లో ఒకరైన సయ్యద్ మొయిద్ 2016లో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్(ఈఐడీ)లో ఐటీ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆ ఏడాది పాంపోరేలోని ఈఐడీ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ భవనంలో ఉన్న దాదాపు 100 మందిని భద్రతా బలగాలు సురక్షితంగా కాపాడాయి. వీరిలో సయ్యద్ మొయిద్ కూడా ఒకరు. అప్పట్లో బలగాలు అతడిని సాధారణ పౌరుడిలానే చూశాయి. తండ్రి ఉగ్రవాది కావడంతో దాడికి సంబంధం ఉందేమోనని అనుమానించలేదు. కనీసం ప్రశ్నించలేదు. ఇప్పుడు అతడి సోదరులైన సయ్యద్ అహ్మద్ షకీల్, షాహిద్ యూసఫ్లు ఉగ్రవాదులకు సహకరిస్తూ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.
సలాహుద్దీన్ సంతానంలోని ఏడుగురిలో ఒక్కరు తప్ప మిగిలిన వారు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. మొయిద్ ఈఐడీలో చేస్తుండగా, షకీల్ షేర్-ఇ-కశ్మీర్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారు. వాహిద్ యూసఫ్ స్కిమ్స్లో డాక్టర్గా, కుమార్తెలు నసీమా, అక్తారాలు ప్రభుత్వ టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో ముగ్గురికి సొంత ప్రాంతాల్లోనే పోస్టింగ్లు ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు