గుజరాత్లో అమానుషం.. జీతం అడిగాడని నోట్లో చెప్పు పెట్టి..!
జీతం అడిగాడన్న కోపంతో ఓ ఉద్యోగిపై సంస్థ నిర్వాహకురాలు భౌతిక దాడి చేశారు. అతడి నోట్లో చెప్పు పెట్టి క్షమాపణ చెప్పేంత వరకు వదల్లేదు.
మోర్బి: తాను పని చేసిన 15 రోజులకు గాను జీతం అడిగాడన్న కారణంతో ఓ ఉద్యోగిపై సంస్థ నిర్వాహకురాలు భౌతిక దాడికి దిగారు. అతడి నోట్లో చెప్పుపెట్టి.. క్షమాపణ చెప్పేంత వరకు వదల్లేదు. అంతేకాకుండా డబ్బు దోచుకోవడానికి వచ్చానని బలవంతంగా అతడితో చెప్పించి వీడియో తీశారు. గుజరాత్లోని (Gujarat) మోర్బిలో (Morbi) బుధవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితురాలితో పాటు, ఆమెకు సహకరించిన మరో ఆరుగురిపై మోర్బి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజౌరీ ఎన్కౌంటర్.. ఉగ్రవాదులు నక్కింది ఇక్కడే!
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విభూతి పటేల్ అనే మహిళ ‘రాణిబా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట టైల్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో నీలేశ్ దల్సానియా అనే 21 ఏళ్ల దళిత యువకుడ్ని మార్కెటింగ్ కోసం నియమించుకున్నారు. నెలకు రూ.12 వేల జీతం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఉన్నట్టుండి అక్టోబర్ 18న అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో వారాంతాలు పోనూ, తాను పని చేసిన 15 రోజుల జీతాన్ని ఇవ్వాల్సిందిగా అతడు నిర్వాహకురాలిని పలుమార్లు కోరాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో తన సోదరుడితోపాటు మరో వ్యక్తితో కలిసి సంస్థ కార్యాలయానికి వెళ్లాడు.
నేరుగా వెళ్లి అడిగేసరికి విభూతి పటేల్కు చిర్రెత్తుకొచ్చింది. తన సోదరుడికి ఫోన్ చేసి రప్పించారు. వారంతా పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నీలేశ్ను టెర్రస్ మీదకి ఈడ్చుకుంటూ వెళ్లిన విభూతి పటేల్.. అతడిపై భౌతికదాడి చేశారు. నోట్లో చెప్పు పెట్టి.. క్షమాపణ అడగాలని కోరారు. ఈలోగా సంస్థలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు కూడా ఆమెకు వత్తాసు పలుకుతూ.. నీలేశ్ తరఫున వచ్చిన వారిపై దాడి చేసినట్లు డీఎస్పీ వివరించారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి, స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు దోచుకునేందుకు వచ్చానని బలవంతగా చెప్పిస్తూ వీడియో తీశారని బాధితుడు పోలీసుల ఎదుట వాపోయాడు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో దాడి వాస్తవమేనని తేలినట్లు డీఎస్పీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ