కొవిడ్ చికిత్స: జింక్, విటమిన్-సీ ప్రభావమెంత?
సాధారణ చికిత్సతో పోలిస్తే జింక్, విటమిన్-సీ మందులు వైరస్ తీవ్రతను తగ్గించడంలో ఆశించినంత ప్రభావం చూపడంలేదని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
అమెరికన్ పరిశోధకులు ఏమన్నారంటే..!
వాషింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్ మహమ్మారి చికిత్స కోసం ఓ వైపు మరిన్ని ఔషధాలు అభివృద్ధికి ప్రయత్నం జరుగుతుండగా.. మరోవైపు ఇప్పటికే అందుబాటులో ఉన్న మందులపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సాధారణ చికిత్సతో పోలిస్తే జింక్, విటమిన్-సీ మందులు వైరస్ తీవ్రతను తగ్గించడంలో ఆశించినంత ప్రభావం చూపడంలేదని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. అమెరికా పరిశోధకులు చేసిన తాజా అధ్యయనాన్ని జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్(JAMA)లో విశ్లేషణకు ఉంచింది.
పరిశోధనలో భాగంగా 214మంది కొవిడ్ రోగులపై అమెరికాలోని క్లెవెలాండ్కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా మొత్తం నాలుగు భాగాలుగా చికిత్స అందించారు. కొందరికి జింక్ గ్లుకొనేట్ (50ఎంజీ), ఇంకొందరికి విటమిన్-సీ (8000 ఎంజీ)లను పది రోజులపాటు అందించగా, మరికొందరికి రెండు మందులు కలిపి ఇచ్చారు. ఇక మిగిలిన వారికి సాధారణ చికిత్స అందించారు. అయితే, 50శాతం లక్షణాలు తగ్గిన ఈ నాలుగు గ్రూపుల వారి ఆరోగ్యాన్ని విశ్లేషించారు. తద్వారా మందులు తీసుకున్న వారిలో, మందులు తీసుకోకుండా సాధారణ చికిత్స తీసుకున్న వారిలో ప్రత్యేకించి ఎలాంటి మార్పు కనిపించలేదని పరిశోధనలకు నేతృత్వం వహించిన మిలింద్ దేశాయ్ స్పష్టంచేశారు. అయితే, వీటి సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ చికిత్సపై మరిన్ని ప్రయోగాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. కరోనా సోకిన వారు జింక్, విటమిన్-సీ మందులను ఎక్కువగా తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ పరిశోధన జరిపినట్లు పరిశోధనలో పాల్గొన్న సుమా థామస్ వెల్లడించారు.
కరోనా వైరస్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుండగా, మరోవైపు చికిత్స కోసం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు కొవిడ్ చికిత్సకు కచ్చితమైన మందులు లేనప్పటికీ కొన్నిరకాల ఔషధాలు చికిత్సలో దోహదం చేస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. వీటిలో జింక్, విటమిన్-సీ ప్రయోజనకరంగా ఉంటున్నట్లు ఇప్పటివరకు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ తీవ్రతను తగ్గించడంలో లేదా లక్షణాలను నియంత్రించడంలో వీటి సామర్థ్యం తక్కువేనని క్లెవెలాండ్ పరిశోధకులు గుర్తించారు. అయితే, యాంటీబాడీలలో కీలకంగా వ్యవహరించే జింక్, తెల్ల రక్తకణాలను ఉత్పత్తి చేయడంతోపాటు వైరస్తో పోరాడే రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఎంతో కీలకంగా వ్యవహరిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక కణాలకు జరిగే అపాయాన్ని విటమిన్-సీ తగ్గిస్తుందని వారు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?