bell bottom: ఇందిరాగాంధీలా మిస్ యూనివర్స్ లారాదత్తా మారిందిలా..!
క్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బెల్బాటమ్’ ట్రైలర్ విడుదలైన 21గంటల్లోనే 20మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతుంది. బాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ అండర్ కవర్ రా ఏజెంట్ ‘బెల్బాటమ్’గా కనిపించనున్నారు. ఇక ట్రైలర్ అంతా ఒకెత్తైతే.. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో ఒదిగిపోయిన లారా దత్తా నటన మరో ఎత్తు.
ముంబయి: అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బెల్బాటమ్’ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతుంది. బాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ అండర్ కవర్ రా ఏజెంట్ ‘బెల్బాటమ్’గా కనిపించనున్నారు. ఇక ట్రైలర్ అంతా ఒకెత్తైతే.. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో ఒదిగిపోయిన లారా దత్తా నటన మరో ఎత్తు. అచ్చుగుద్దినట్టు ఇందిరా గాంధీ హెయిర్స్టైల్, చీరకట్టు, హావభావాలు పలకించారు 46ఏళ్ల నటి, మిస్ యూనివర్స్ లారా. ఇంత సహజంగా.. ఇందిరాగాంధీలా కనిపించేందుకు లారాదత్తాకు ప్రోస్థెటిక్ మేకప్ వేశారు. సవాలుతో కూడుకున్న ఇలాంటి పాత్ర పోషించడం ఆమెకు మొదటిసారి. ప్రస్తుతం నెట్టింట ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ‘‘లారా పాత్రలో చక్కగా నటించింది. మేము చూసేది లారానా లేక ఇందిరాగాంధీనా’’ అంటూ ట్విటర్లో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ప్రోస్థెటిక్ మేకప్తో ఇందిరాగాంధీలా కనిపించేలా చేసిన మేకప్ ఆర్టిస్ కృషికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ మేకప్ ఆర్టిస్ట్.. జాతీయ పురస్కారానికి అర్హుడంటూ కొనియాడుతున్నారు.
కేవలం లారా దత్తానే కాదు. బాలీవుడ్, కొలీవుడ్లో ఎందరో తారలు ప్రోస్థెటిక్ మేకప్లో నటించి మెప్పించించారు. ఈ మేకప్ వేసుకునేందుకు సుమారు 4గంటల పైనే సమయం పడుతుంది. ‘పా’ చిత్రంలో బిగ్బి అమితాబ్ బచ్చన్, ‘రాబ్తా’లో రాజ్కుమార్ రావ్, ‘భారతీయుడు’లో వృద్ధుడి గెటప్లో కమల్హాసన్, భామనే సత్యభామనేలో బామ్మగెటప్లో కమల్ హాసన్.. కపూర్ అండ్ సన్స్లో రిషి కపూర్, ఫ్యాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్, ధూమ్2లో హృతిక్ రోషన్, ది నంబీ ఎఫెక్ట్లో ఆర్.మాధవన్, సంజూ చిత్రంలో రణ్బీర్ కపూర్, ఛపాక్లో దీపిక పదుకొణె.. అలాంటి సవాలుతో కూడుకున్న పాత్రలు పోషించి మెప్పించిన వాళ్లే.
అమితాబ్ బచ్చన్
2009లో విడుదలైన ‘పా’ కామెడీ డ్రామా నేపథ్యంలో ఆర్.బల్కి దర్శకత్వంలో వచ్చింది. ఇందులో అమితాబ్ బచ్చన్ ప్రొజిరియా అనే అరుదైన జన్యు సమస్యతో బాధపడే వ్యక్తి పాత్రలో నటించారు. ఈ వ్యాధితో వయసు చిన్నదైన సరే, భారీ ఆకారంలో కనిపిస్తారు. అలా అమితాబ్ శరీరంలో మార్పు వచ్చేలా ప్రొస్థెటిక్ మేకప్ వేశారు. కాగా ఇందులో తనయుడు అభిషేక్ బచ్చన్కి కొడుక పాత్రలో నటించి మెప్పించాడు బిగ్బి. ఇందుగానూ మూడోసారి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అంతే కాదు.. ఐదో ఫిల్మ్ఫేర్ అవార్డు సైతం ఆయన్నే వరించింది.
కమల్ హాసన్ (భారతీయుడు, భామనే సత్యభామనే, దశావతారం)
* అవినీతి, లంచగొండితనాన్ని ప్రశ్నిస్తూ శంకర్ సంధించిన బాణం ‘భారతీయుడు’. కమల్హాసన్ ద్విపాత్రాభినయం చేశారు. 1996లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడిగా వృద్ధుడి పాత్రలో నటించి మెప్పించారు కమల్. అదే ఏడాదికి గానూ జాతీయ ఉత్తమ నటుడు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు సౌత్, సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు.. ఇలా నాలుగు అవార్డులను దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్గా ‘భారతీయుడు-2’ శంకర్ దర్శకత్వంలో రాబోతుంది. నెడుమూడి వేణు, కాజల్, రకుల్, సిద్ధార్థ్, బాబి సింహా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
* కమల్హాసన్లో నట విశ్వరూపాన్ని తెరపై చూపించిన చిత్రం ‘దశావతారం’. 2008లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఉత్తమ నటుడు విభాగంలో తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ విలన్, ఉత్తమ కథ, స్క్రీన్ప్లే విభాగాలకు విజయ అవార్డ్ దక్కించుకున్నారు. అమెరికన్ మేకప్ ఆర్టిస్ట్ మైకెల్ వెస్ట్మోర్, కోదండపాణి ఉత్తమ మేకప్ విభాగంలో తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. అంతకుముందు ‘భామనే సత్యభామనే’లో కూడా కమల్ హాసన్ బామ్మ పాత్ర పోషించారు. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. కాగా కె.ఎం శరత్ కుమార్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ విభాగానికి గానూ తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు.
రిషి కపూర్ (కపూర్ అండ్ సన్స్)
కపూర్ అండ్ సన్స్ చిత్రంలో 90 ఏళ్ల వృద్ధుడి పాత్రలో నటించారు రిషి కపూర్. 2016లో విడుదలైన ఈ చిత్రాన్ని శకున్ బాత్రా దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో నటించిన రిషి కపూర్కి ఉత్తమ సహాయనటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డ్, స్టార్ స్ర్కీన్ అవార్డ్, ఉత్తమ హాస్యనటుడిగా జీ సినీ అవార్డ్స్ వరించాయి.
దీపికా పదుకొణె (ఛపాక్)
యాసిడ్ దాడికి గురైన లక్ష్మీరాయ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటించారు. 2020లో విడుదలైన ఈ చిత్రాన్ని మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ దీపికా లుక్ తో పాటు అభినయానికి మంచి మార్కులే పడ్డాయి.
షారుఖ్ ఖాన్ (ఫ్యాన్)
2016లో విడుదలైన ఫ్యాన్ చిత్రంలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేశారు. నటుడు ఆర్యన్ ఖన్నా, అతడి ఫ్యాన్గా గౌరవ్ చంద్నా పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రానికి దర్శకత్వం మనీష్ శర్మ వహించారు. ఉత్తమ మేకప్ విభాగానికి గానూ అమెరికన్ గ్రేగ్ కానామ్ ఇంటర్నేష్నల్ ఇండియాన్ ఫిల్మ్ అకాడెమీ అవార్డు అందుకున్నారు. షారుఖ్కు ఉత్తమ నటుడిగా స్టార్ డస్ట్ అవార్డు వరించింది
రణ్బీర్ కపూర్ (సంజూ)
నటుడు సంజయ్దత్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘సంజూ’లో రణ్బీర్ కపూర్.. సంజయ్ దత్ పాత్రను పోషించారు. 2018లో విడుదలైన ఈ చిత్రానికి రాజ్కుమార్ హిరాణీ దర్శకత్వం వహించారు. యువకుడి నుంచి వృద్ధుడి పాత్రలో నటించి మెప్పించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు దక్కించుకుంది. రూ. 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ.590 కోట్ల వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా మున్నాభాయ్ ఎంబీబీఎస్, జైల్ సీన్లో రణ్బీర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఉత్తమ నటుడు విభానికి గానూ జీ సినీ అవార్డుతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కించుకున్నారు.
మాధవన్ (రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్)
ఇస్రో ఏరో స్పేస్ ఇంజినీర్, శాస్త్రవేత నంబి నారాయణ్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమే రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్. ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం ఇదే ఏడాది విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో హీరోగా నటించిన మాధవన్.. ఈ చిత్రానికి తొలిసారి దర్శకత్వం, స్ర్కీన్ప్లే వహించడం విశేషం. హిందీ, ఇంగ్లిష్, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రాబోతుంది. సిమ్రాన్ ఈ చిత్రంలో హీరోయిన్.
విక్రమ్ (కోబ్రా)
విలక్షణ పాత్రలకే కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు నటుడు విక్రమ్. గతంలో ఆయన నటించిన పలు చిత్రాలు, అందులోని పాత్రల కోసం ఎంత కష్టపడేవారు. ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘మల్లన్న’, ‘ఇంకొక్కడు’, చిత్రాల్లో విభిన్న గెటప్లో అలరించిన విక్రమ్ ఇప్పుడు మరోసారి అదేబాట పట్టారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’ ఇందులో ఏడు విభిన్న పాత్రల్లో ఆయన కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్