నేను మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కాదు: నవ్‌దీప్‌

‘జై’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై ‘గౌతమ్‌ ఎస్‌ఎస్‌సి’, ‘చందమామ’ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు నవ్‌దీప్‌. కథానాయకుడిగానే కాకుండా నటుడిగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ ప్రసారమవుతోన్న....

Published : 29 Oct 2020 12:31 IST

వాళ్లిద్దరి కోసం చొక్కాలు చింపుకున్నా

హైదరాబాద్‌: ‘జై’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై ‘గౌతమ్‌ ఎస్‌ఎస్‌సి’, ‘చందమామ’ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు నవ్‌దీప్‌. కథానాయకుడిగానే కాకుండా నటుడిగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ ప్రసారమవుతోన్న ‘ఆలీతో సరదాగా’ సెలబ్రిటీ చాట్‌ కార్యక్రమానికి తాజాగా నవ్‌దీప్‌ విచ్చేశారు.

ఓ రోజు సినిమా చూసి వస్తుంటే రిక్షా అతను తనని చూసి.. ‘హీరో అవ్వొచ్చుగా బాబు. భలే ఉన్నారు మీరు’ అని అన్నాడని.. ఆ మాటతో ఇండస్ట్రీలోకి రావాలనే ఆశ కలిగిందని నవ్‌దీప్‌ తెలిపారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ల కోసం తాను థియేటర్లలో చొక్కాలు చింపుకొనే వాడినని చెప్పారు. అనంతరం తాను మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కాదని సరదాగా చెప్పారు. తన జీవితానికి సంబంధించి నవ్‌దీప్‌ చెప్పిన ఎన్నో సరదా విషయాలు తెలుసుకోవాలంటే వచ్చే సోమవారం ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ చూడండి. నవంబర్‌ 2న ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ ఎపిసోడ్‌ ప్రోమో మీ కోసం.. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని