ఎన్‌సీడబ్ల్యూ వద్దకు పాయల్‌

బాలీవుడ్‌ నటి పాయల్‌ఘోష్‌ మంగళవారం జాతీయ మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ రేఖా శర్మను కలిశారు. దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనను లైంగికంగా వేధించాడని ఇటీవల

Published : 06 Oct 2020 19:55 IST

న్యూదిల్లీ : బాలీవుడ్‌ నటి పాయల్‌ఘోష్‌ మంగళవారం జాతీయ మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ రేఖా శర్మను కలిశారు. దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనను లైంగికంగా వేధించాడని ఇటీవల పాయల్‌ఘోష్‌ ఓ మీడియాకు వెల్లడించారు. అనంతరం అనురాగ్‌ కశ్యప్‌పై చర్యలు తీసుకోవాలని ముంబయి పోలీసులను ఆశ్రయించారు. పాయల్‌ ఆరోపణలపై పోలీసులు అనురాగ్‌కశ్యప్‌ను విచారించారు. తర్వాత కేసుకు సంబంధించి పోలీసులు ఎటువంటి ముందడుగు వేయలేదు. ఈ నేపథ్యంలో కేసు పురోగతి గురించి చర్చించేందుకు తను ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ను కలిసినట్లు పాయల్‌ వివరించారు. 

కేసుకు సంబంధించి రేఖా శర్మ తనకు మొదటి రోజు నుంచి అండగా ఉన్నట్లు పాయల్‌ఘోష్‌ వివరించారు. భయం లేకుండా ఇంటి నుంచి బయటికి వచ్చి పని చేసుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం తనకు వై-ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీ కేటాయించాలని ఆమె కోరారు. మరో నటి రిచా చద్దా తనపై, ఇతరులపై వేసిన పరువునష్టం దావాకు సంబంధించి పాయల్‌ మాట్లాడారు. రిచాకు వ్యతిరేకంగా తాను ఏమీ మాట్లాడలేదని వివరించారు. రిచా చద్దా గురించి మాట్లాడానని.. తన పరువును దిగజార్చేలా వ్యాఖ్యలు చేయలేదని పాయల్‌ఘోష్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని