‘జెర్సీ’ కోసం రూ.35 కోట్లు అడిగారా..?

తెలుగులో సూపర్‌హిట్‌ అందుకున్న ‘జెర్సీ’ని హిందీలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌లో షాహిద్‌ కపూర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. మాతృకను తీసిన గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా...

Published : 24 Sep 2020 00:58 IST

ముంబయి: తెలుగులో సూపర్‌హిట్‌ అందుకున్న ‘జెర్సీ’ని హిందీలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌లో షాహిద్‌ కపూర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. మాతృకను తీసిన గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. గతేడాది డిసెంబరులో షూటింగ్‌ ఆరంభమైంది. ఈ సినిమా కోసం షాహిద్‌ రూ.35 కోట్లు+పన్ను పారితోషికంగా తీసుకుంటున్నారట. అంతేకాదు సినిమాకు వచ్చే లాభంలో 20 శాతం వాటా కూడా ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. గత సినిమా విజయం సాధించిన నేపథ్యంలో ఆయన పారితోషికం పెంచినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించాల్సిందే.

ఇప్పటికే షాహిద్‌ తెలుగు సినిమా ‘అర్జున్‌ రెడ్డి’ హిందీ రీమేక్‌లో నటించారు. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కియారా అడ్వాణీ కథానాయికగా నటించారు. రూ.60 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా రూ.379 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. అంతేకాదు షాహిద్‌, కియారా నటనకు సినీ ప్రముఖులతోపాటు నెటిజన్ల ప్రశంసలు లభించాయి. ‘జెర్సీ’లో నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించారు. ఇందులో నేచురల్‌ స్టార్‌ క్రికెటర్‌ పాత్రలో కనిపించి అలరించారు. మరి హిందీ రీమేక్‌ ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోనుందో చూడాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని