Aadavallu Meeku Johaarlu: అది ఇంచుమించు నరకం

శర్వానంద్‌, రష్మిక జంటగా తిరుమల కిషోర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఖుష్బూ, ఊర్వశీ, రాధికా శరత్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం చిత్ర టీజర్‌ విడుదల చేశారు

Updated : 11 Feb 2022 09:38 IST

శర్వానంద్‌, రష్మిక జంటగా తిరుమల కిషోర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఖుష్బూ, ఊర్వశీ, రాధికా శరత్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం చిత్ర టీజర్‌ విడుదల చేశారు. ‘‘ప్రతి మగాడి జీవితంలో పెళ్లి అనేది ఓ ముఖ్యమైన ఘట్టం. ఇంట్లో పది మంది ఆడాళ్లు ఉండి.. ఒక అమ్మాయిని ఓకే చేయడమంటే ఇంచుమించు నరకం’’ అంటూ శర్వా వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. మహిళలు కుటుంబంపై ఆధిపత్యం చెలాయించడం వల్ల.. పెళ్లి విషయంలో శర్వా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది ప్రచార చిత్రంలో వినోదాత్మకంగా చూపించారు. అయితే రష్మిక తన జీవితంలోకి ప్రవేశించాక ఏం జరిగింది? ఆమె ప్రేమను సాధించడం కోసం అతనెలాంటి పాట్లు పడాల్సి వచ్చిందన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఆఖర్లో     ‘‘మన పెళ్లి జరగదు’’ అని రష్మిక కూల్‌గా శర్వాకు చెప్పడం.. అనంతరం అతను ఓ వెర్రి నవ్వు నవ్వడంతో టీజర్‌ ఆసక్తికరంగా ముగిసింది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు. సుజిత్‌ సారంగ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని