ఈ వైరం... ఆ తీరం
కథానాయకుడికి తగిన జోడీ ఎంత ముఖ్యమో... సై అంటే సై అంటూ ఢీ కొట్టే ప్రతినాయకుడూ అంతే కీలకం. సినిమాలో హీరోయిజం పండాలంటే, హీరోకి ప్రత్యర్థిగా కనిపించే విలన్ దీటుగా ఉండాల్సిందే. రాజమౌళి సహా కొద్దిమంది దర్శకులు విలన్ పాత్రలపై ప్రత్యేకమైన ప్రేమని కనబరుస్తుంటారు. హీరోని మించి ఆ పాత్రల్ని తీర్చిదిద్దుతుంటారు. ఆయా దర్శకుల సినిమాల్లోని హీరోల గురించి ఎంతగా మాట్లాడుకుంటామో...
కథానాయకుడికి తగిన జోడీ ఎంత ముఖ్యమో... సై అంటే సై అంటూ ఢీ కొట్టే ప్రతినాయకుడూ అంతే కీలకం. సినిమాలో హీరోయిజం పండాలంటే, హీరోకి ప్రత్యర్థిగా కనిపించే విలన్ దీటుగా ఉండాల్సిందే. రాజమౌళి సహా కొద్దిమంది దర్శకులు విలన్ పాత్రలపై ప్రత్యేకమైన ప్రేమని కనబరుస్తుంటారు. హీరోని మించి ఆ పాత్రల్ని తీర్చిదిద్దుతుంటారు. ఆయా దర్శకుల సినిమాల్లోని హీరోల గురించి ఎంతగా మాట్లాడుకుంటామో... విలన్ గురించీ అంతే! ఆ మేజిక్ని చూసి ఇతర దర్శకులూ అదే పద్ధతిని అనురిస్తుంటారు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ బలమైన విలన్లని ఎంపిక చేసుకుంటున్నారు. అందుకే తెలుగు సినిమాల్లో అటు హిందీ, భోజ్పురి నటులు మొదలుకొని ఇటు బెంగాల్కి చెందిన జిషూ సేన్ గుప్తా వరకు ఎంతోమంది మన హీరోల్ని ఢీ కొట్టేందుకు వస్తున్నారు.
రామ్చరణ్ శంకర్ సినిమాలో నాయిక ఎవరన్నది ఖరారైంది. ఇక తేలాల్సింది ప్రతినాయకుడే. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ చేస్తున్న ‘సలార్’లో విలనిజం బాధ్యత ఎవరనేది అధికారికంగా ఖరారు కాలేదు. చిరంజీవి, బాలకృష్ణలకీ విలన్లు కావాలి. కొన్నాళ్లుగా విలన్ ఎంపిక పనిలోనే ఉన్న ఆయా చిత్రబృందాలు ఓ నిర్ణయానికొచ్చాయని పరిశ్రమ వర్గాలు చెప్పుకొంటున్నాయి.
బాలకృష్ణ కోసం విజయ్ సేతుపతి?
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందనున్న ఆ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘లూసిఫర్’ రీమేక్లో ప్రతినాయకుడిగా ఓ హీరో కనిపిస్తారని తెలిసింది. మలయాళంలో ఆ పాత్రని హిందీ హీరో వివేక్ ఒబెరాయ్ చేశారు. మరి ఆయన్నే తెలుగులో రంగంలోకి దించుతారేమో చూడాలి.
బన్నీ విలన్తోనే చరణ్ ఢీ
విలన్ పాత్రల కోసం కథానాయకుల్నే రంగంలోకి దింపడం కొత్త ట్రెండ్. రానా దగ్గుబాటి, ఆది పినిశెట్టి, ఆర్య తదితరులు ప్రతినాయకులుగా కనిపించి సత్తా చాటిన విషయం తెలిసిందే. ‘పుష్ప’ కోసం మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ వారంలోనే చిత్రీకరణలో పాల్గొనున్నారాయన. బన్నీని ఢీ కొట్టే ఫహాద్ తదుపరి రామ్చరణ్కీ విలన్గా కనిపిస్తారని సమాచారం. రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దిల్రాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో విలన్గా ఫహాద్ ఎంపికయ్యారని తెలిసింది. శంకర్ సినిమాల్లో ప్రతినాయక పాత్రలు ఓ రేంజ్లో ఉంటాయి. మరి ఫహాద్ని శంకర్ ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఫ్యామిలీమేన్తో ప్రభాస్ ఫైట్!
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రుతిహాసన్ కథానాయిక. ప్రభాస్ డాన్గా కనిపిస్తారని సమాచారం. ఇందులో ఆయన్ని ఢీ కొట్టే ప్రతినాయకుడిగా ‘ఫ్యామిలీమేన్’ ఫేమ్ మనోజ్ బాజ్పాయ్ని ఎంపిక చేశారని సమాచారం. ఇటీవలే హైదరాబాద్లో ఓ కీలక షెడ్యూల్ని చిత్రీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
తన తల్లితో కలిసి రామ్ చరణ్ పిఠాపురానికి వెళ్లనున్నారు. ఎందుకంటే? -
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
Raja Saab: ప్రభాస్, మారుతీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్ర షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. -
అందుకే సెల్ఫీ అడిగితే పారిపోతా: ఫహద్ ఫాజిల్
ఎవరైనా సెల్ఫీ అడిగితే తాను పారిపోతానని నటుడు ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘హీరామండి’ షూటింగ్లో డిప్రెషన్లోకి వెళ్లా: మనీషా కొయిరాల
‘హిరామండి’ షూటింగ్ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లినట్లు మనీషా కొయిరాల తెలిపారు. -
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
విజయ్ దేవరకొండ-రష్మిక జోడి మరోసారి స్క్రీన్పై మెరవనున్నట్లు తెలుస్తోంది. -
27 ఏళ్లలో బాలీవుడ్ నుంచి ఒక్క అవకాశం రాలేదు: జ్యోతిక
తన తొలి చిత్రం ప్రేక్షకాదరణ పొందని కారణంగా 27 ఏళ్లు బాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదని జ్యోతిక అన్నారు. -
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
krishnamma movie review: సత్యదేవ్ కీలక పాత్రలో నటించిన మాస్, యాక్షన్ డ్రామా ఎలా ఉంది? -
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
‘గాలివాన’లో ప్రదర్శన.. చేసేది లేక స్టేజ్పై నుంచి దిగి వెళ్లిన పోయిన కృష్ణ
అప్పలాచార్య రాసిన ‘వింత మనుషులు’ నాటికలో పాత్రలు ఎక్కువ. ఆ నాటికి ప్రదర్శిస్తుండగా, భారీ గాలివాన వచ్చింది. -
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. -
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త. -
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
Prathinidhi 2 Review: నారా రోహిత్ కీలక పాత్రలో నటించిన ‘ప్రతినిధి2’ ప్రేక్షకుల మెప్పించిందా? -
‘సికందర్’ సరసన రష్మిక
త్వరలో ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది అందాల తార రష్మిక. -
రామోజీ ఫిల్మ్ సిటీలో.. కన్నప్ప సెట్లో
మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. -
అంధుడి పాత్రలో సైఫ్ అలీఖాన్?
పాత్ర బాగుంటే అది హీరోనా... విలనా అనేది చూడనంటారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. -
ప్రతినిధి 2 అలరిస్తుంది.. ఆలోచింపజేస్తుంది
‘‘ప్రస్తుత భారతదేశ రాజకీయాల్ని ప్రతిబింబించే చిత్రం ‘ప్రతినిధి 2’. ఇది ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీకో మేలు చేసేలా ఉండదు. -
మళ్లీ జాలీగా వచ్చేసింది పుష్ప
బాలీవుడ్లో నవ్వులు పూయించిన చిత్రాలు ఎన్నో. అందులో ‘జాలీ ఎల్ఎల్బీ’ ఫ్రాంచైజీ సినిమాలు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు. -
మాయావన్లో పోరు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘మాయావన్’. -
మరో కొత్త కథతో నయన్ సిద్ధం!
గతేడాది ‘జవాన్’తో సినీప్రియుల్ని మెప్పించిన అగ్రకథానాయిక నయనతార.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన బౌలర్లు.. చెన్నైపై గుజరాత్ విజయం
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!