Pranitha: ఘనంగా ప్రణీత వివాహం

‘అత్తారింటికి దారేది’తో బాపుబొమ్మగా తెలుగువారికి ఎంతో చేరువైన ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త....

Updated : 01 Jun 2021 19:48 IST

వ్యాపారవేత్తతో ఏడడుగులు వేసిన బాపుబొమ్మ

హైదరాబాద్‌: ‘అత్తారింటికి దారేది’లో తన అందంతో బాపుబొమ్మగా తెలుగువారికి ఎంతో చేరువైన ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో ఆమె ఏడడుగులు వేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అతి తక్కువమంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఆదివారం వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. తాజాగా ప్రణీత-నితిన్‌ల వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

పోర్కీ(పోకిరి కన్నడ వెర్షన్‌) చిత్రంతో ప్రణీత కథానాయికగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’, ‘బావ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రణీత తెలుగులో తెరకెక్కిన చాలా సినిమాల్లో కథానాయికగానే కాకుండా సెకండ్‌ లీడ్‌గా కూడా కనిపించారు. ‘అత్తారింటికి దారేది’, ‘రభస’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘బ్రహ్మోత్సవం’, ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాలు నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ‘హంగామా-2’లో నటిస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీల కోసం, అన్నార్తుల కోసం తనవంతు సాయం చేశారు. స్వయంగా ఆహారం తయారు చేసి అందిస్తూ అందరి మనసును గెలుచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని