Adivi Sesh: అది... ఆస్కార్ గెలవడంతో సమానం!
విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న కథానాయకుడు అడివిశేష్. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెర కెక్కిన ‘మేజర్’ చిత్రం చేశారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలవుతున్న ఆ సినిమా ప్రచారంలో భాగంగా దేశమంతా పర్యటిస్తున్నారు అడివి శేష్. ఈ సందర్భంగా ఆయన ‘ఈనాడు సినిమా’తో ఫోన్లో సంభాషించారు.
విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న కథానాయకుడు అడివిశేష్. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెర కెక్కిన ‘మేజర్’ చిత్రం చేశారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలవుతున్న ఆ సినిమా ప్రచారంలో భాగంగా దేశమంతా పర్యటిస్తున్నారు అడివి శేష్. ఈ సందర్భంగా ఆయన ‘ఈనాడు సినిమా’తో ఫోన్లో సంభాషించారు.
విడుదలకి ముందే పలుచోట్ల సినిమాని చూపిస్తున్నారు. ఆ నిర్ణయం వెనుక కారణమేంటి?
అమాయకమైన కారణాలతో తీసుకున్న నిర్ణయం అది. తెలుగులో ప్రచారం చేసినట్టుగా, హిందీలోనూ టెలివిజన్ కార్యక్రమాల్లో పాల్గొందామని మేం భావించాం. అక్కడ కొన్ని షోలు రద్దయ్యాయి. మా సినిమా విడుదల సమయానికి ఇలాంటి అడ్డంకులు వచ్చాయేమిటి అనిపించింది. మా సినిమా ఎంత బాగుందో మేం షోలల్లో పాల్గొని చెప్పేబదులు, సినిమానే చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. మేజర్ సందీప్ సాహసం స్ఫూర్తితో మేం ధైర్యంగా వేసిన అడుగు అది. భారతీయ సినిమా చరిత్రలో ఓ పెద్ద సినిమాని పది రోజుల ముందే పది నగరాల్లో ప్రదర్శించడం చాలా పెద్ద విషయం. ప్రేక్షకుల నుంచి నా కెరీర్లోనే అత్యుత్తమమైన స్పందనని చూశా.
మేజర్ సందీప్ తల్లి దండ్రులు సినిమాని చూశారా?
వాళ్లు ఇప్పటికే చాలా సన్నివేశాల్ని చూశారు. 31వ తేదీన పూర్తిస్థాయి సినిమాని బెంగళూరులో చూస్తారు. నిర్మాణంలో భాగమైన కథానాయకుడు మహేష్బాబు చూశారు. అందమైన వ్యక్తి నుంచి అంతే అందమైన స్పందన వచ్చింది. ఆయన మెచ్చుకోవడం మాకు ఆస్కార్ గెలవడంతో సమానం.
26/11 నేపథ్యాన్ని ఇదివరకు చాలా మంది స్పృశించారు కదా...?
‘తొలిప్రేమ’ వచ్చిందని ‘ఖుషీ’ చూడకుండా ఉండలేం కదా. మేం చెప్పాలనుకున్నది ఒక అందమైన జీవితం గురించి. అందులో కార్గిల్ యుద్ధం ఉంటుంది, 26 /11 నేపథ్యమూ ఉంటుంది. సందీప్ హైదరాబాద్ కంటోన్మెంట్లో కెప్టెన్. హర్యానాలో ట్రైనింగ్ ఆఫీసర్. సందీప్ తన ఆఖరి 36 గంటల్లో ఎన్ని వందలమంది ప్రాణాలు కాపాడి చనిపోయారో అందరికీ తెలుసు కానీ... దానికి ముందు 31 ఏళ్లు ఎంత అందంగా బతికారనేది ఎవరికీ తెలియదు. సినిమాలో మొదటి 35 నిమిషాలు ‘జానే తు యా జానే నా’, ‘నువ్వే కావాలి’ లాంటి సినిమాలు చూసినంత ఆహ్లాదంగా ఉంటుంది.
సందీప్ జీవితంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారా?
సందీప్ జీవిత సారాన్ని తీసుకుని చేసిన కథ ఇది. కొన్ని కల్పితాలు ఉండొచ్చు కానీ... ఆ జీవితానికీ, అందులోని భావోద్వేగాలకి న్యాయం చేస్తున్నామా లేదా? అనేది చూసుకునే సినిమా చేశాం. పక్కింటి కుర్రాడు. అమ్మానాన్నతో కలిసి పాయసం తింటూ దాని గురించి మాట్లాడిన కుర్రాడు. స్కూల్కి వెళుతూ, సరదాగా ఆడుకుంటూ, గళ్ఫ్రెండ్తో ముచ్చట్లు చెబుతూ, స్నేహితులతో కలిసి స్కూల్కి బంక్ కొట్టి సినిమాలు, షికార్లు అంటూ తిరిగిన ఆ కుర్రాడు మేజర్ సందీప్ ఎలా అయ్యాడు? కార్గిల్ యుద్ధంలోనూ, తాజ్ లోపల తను తీసుకున్న పెద్ద పెద్ద నిర్ణయాలకి అప్పటిదాకా గడిపిన అతని జీవితం ఎలా ప్రభావితం చేసిందనే విషయాల్ని ఇందులో చూపించాం.
ఈ చిత్రీకరణలో ఎదురైన సవాళ్లేంటి?
అడుగడుగునా సవాళ్లే. చిత్రీకరణ ఊపందుకుంటోంది అనుకునే సమయంలోనే కొవిడ్ భయపెట్టేది. వందకిపైగా రోజులు, 75 లొకేషన్లు, ఎనిమిది భారీ సెట్లు నిర్మించి సినిమా చేశాం. దిల్లీ, హర్యానా, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో చిత్రీకరణ చేశాం. మిలటరీ లొకేషన్లలో చిత్రీకరణ చేయడం అన్నిటికంటే పెద్ద సవాల్. అనుమతులు అంత సులభంగా రావు. చాలా రోజుల తర్వాత పూర్తిగా మన హైదరాబాద్లో తయారైన భారతీయ సినిమా ఇది.
ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుని సాధించనున్నారు. ఆ విషయంపై మీ అభిప్రాయం?
ఆల్ ఇండియన్ మనిషి సందీప్ గురించి సినిమా చేశాననేది నా భావన. అంతకంటే వేరే ఆశలు పెట్టుకుని నేను చేయలేదు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది? చూశాక ప్రేక్షకులు ఏమనుకుంటారనే సందేహం ఏ రోజూ కలగలేదు. మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడంతోపాటు, కచ్చితంగా నా కెరీర్పై పలు రకాలుగా ప్రభావం చూపిస్తుందనైతే నమ్ముతాను.
కెరీర్పై మీ అమ్మానాన్నలు ఏమంటున్నారు?
‘క్షణం’ సినిమాతోనే నేను నటుడిగా స్థిరపడిపోయాననే భావన వాళ్లలో కలిగింది. ఏదైనా సినిమా ఆలోచన పంచుకోవడానికి సిద్ధమైతే ‘నువ్వు సినిమా తీస్తున్నావంటే అది బాగుంటుందిరా. చెప్పాల్సిన అవసరమే లేదు’ అంటుంటారు మా నాన్న. నాకు దక్కిన ఓ గొప్ప ప్రశంస అది. ప్రేక్షకులు నాపై ప్రదర్శిస్తున్న నమ్మకం గుర్తొస్తే తృప్తి కలుగుతుంది.
కొత్త సినిమాల కబుర్లేమిటి?
నాని నిర్మాణంలో రూపొందుతున్న ‘హిట్ 2’ సినిమా ఉంది. మార్వెల్ ప్రపంచంలాగా దాన్ని మరింత పెద్దగా చేద్దామని నన్ను ఆ ప్రాజెక్ట్లోకి రమ్మన్నారు. ఒకొక్క పోలీస్ అధికారి కథ ఒకొక్క నగరంలో జరుగుతుంటుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. తదుపరి ‘గూఢచారి2’ చేయాలి. స్క్రిప్ట్ రాయడంపై దృష్టిపెట్టా. కథకి అవకాశం ఉందన్నప్పుడు కచ్చితంగా నా సినిమాల్ని పాన్ ఇండియా మార్కెట్ లక్ష్యంగానే రూపొందిస్తాం.
రచన పరంగా ప్రభావం చూపిస్తున్నారు. దర్శకత్వంపై దృష్టి పెడదామనే ఆలోచనలు వస్తుంటాయా?
నేనొక విజయవంతమైన నటుడిని, మంచి రచయితని, దర్శకుడిగా పరాజితుడిని. ఆ మాట చాలా నమ్మకంగా చెబుతాను. అయితే నేను రచయితని కావడం నా కెరీర్కి చాలా మేలైంది. కథల కోసం ఎవరి దగ్గరికో వెళ్లాల్సిన అవసరం ఉండదు. మంచి కథలు మన దగ్గరే ఉన్నాయని తెలుసు కాబట్టి! ఈ సినిమా విషయంలో దర్శకుడు శశికిరణ్ తిక్క పడిన కష్టం చాలా ఎక్కువ. తను సితార సంస్థలో సినిమా చేస్తుంటే, ఒక్క ఏడాది అని చెప్పి తీసుకొచ్చా. తీరా మూడేళ్లయింది. నా కెరీర్ని మరోస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు తను. సందీప్లాంటి ఓ గొప్ప మనిషి జీవితంలో ఎన్నో గొప్ప విషయాలున్నాయి. వాటిలో ఏది చూపించాలనే విషయంపై శశికిరణ్ అద్భుతమైన పనితీరుని ప్రదర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ షేర్ చేసిన పూరి జగన్నాథ్..
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. -
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్ను ప్రకటించారు. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
జులై నుంచి ప్రేమలో..
ప్రభాస్ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమైనట్టు సినీ వర్గాలు తెలిపాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో... అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. -
సంయుక్త.. ఊ కొట్టేనా?
తెలుగు చిత్రసీమలోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలందుకుంటూ స్టార్ నాయిక స్థాయికి చేరుకుంది సంయుక్తా మేనన్. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘స్వయంభూ’తో పాటు శర్వానంద్తోనూ ఓ చిత్రం చేస్తోంది. -
ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది
‘నేను మొదటగా సంతోషపడేది నన్ను నేను తెరపై చూసుకున్నప్పుడే’ అని అంటోంది బాలీవుడ్ కథానాయిక యామీ గౌతమ్. ‘ఆర్టికల్ 370’తో భారీ విజయాన్ని అందుకుందీమె. హిందీలోనే కాదు తెలుగు చిత్రాల్లోనూ నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. -
వాణీ కోసమే ఈ పాత్ర!
నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది బాలీవుడ్ నాయిక వాణీ కపూర్. ఇప్పుడామె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఆమె ప్రధాన పాత్రలో ‘బడ్తమీజ్ గిల్’ అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
‘కన్నప్ప’లో అక్షయ్ పని పూర్తి
‘కన్నప్ప’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. -
సమ్మోహనం.. ఈ కలయిక
అపూర్వమైన కలయికలు కొన్ని ఉంటాయి. వాళ్లు కలిశారంటే చాలు... సినిమాకి క్లాప్ కొట్టిన రోజే బ్లాక్బస్టర్ బొమ్మని తెరపై చూసేసినంత సంబరం. రజనీకాంత్ - అమితాబ్ బచ్చన్ కలయిక అచ్చం అలాంటిదే. భారతదేశం గర్వించదగ్గ తారలు ఈ ఇద్దరూ. -
త్వరలో కుందాపురానికి ‘కాంతార 1’
‘కాంతార’ సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు రిషబ్ శెట్టి. ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్గా ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. -
ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు
అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారణాసి మానస కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే?
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM