బిగ్బాస్ సీజన్-4 విజేత అభిజీత్
బిగ్బాస్ సీజన్-4 విజేతగా యువ కథానాయకుడు అభిజీత్ నిలిచాడు. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో ఫినాలే ఆదివారం సినీ తారల
హైదరాబాద్: బిగ్బాస్ సీజన్-4 విజేతగా యువ కథానాయకుడు అభిజీత్ నిలిచాడు. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో ఫినాలే ఆదివారం సినీ తారల సందడి మధ్య ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి సీజన్-4 విజేత అభిజీత్కు ట్రోఫీతో పాటు నగదు బహుమతిని అందించారు. ఈ సీజన్లో ఫైనలిస్ట్లుగా అఖిల్, అభిజీత్, సోహైల్, అరియానా, హారిక నిలవగా.. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు గట్టిపోటీ ఇచ్చారు.
ఫైనలిస్ట్లుగా నిలిచిన వారిలో నుంచి హారిక మొదట బయటకు రాగా, ఆ తర్వాత అరియానా, సోహైల్ బయటకు వచ్చారు. ఆ తర్వాత అభిజీత్-అఖిల్ల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో విజేతగా ఎవరు నిలుస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెరదించుతూ అత్యధిక ఓట్లు సాధించి ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్న అభిజీత్ను విజేతగా ప్రకటించారు. హౌస్లో అడుగు పెట్టిన నాటి నుంచి తోటి హౌస్ మేట్స్తో కలిసిపోయి ఉండటం, బిగ్బాస్ ఇచ్చే టాస్క్లను మైండ్ గేమ్తో ఆడడం వంటివి అభిజీత్కు అభిమానులను పెంచడమే కాకుండా విజేతగానూ నిలబెట్టాయి.
స్మార్ట్ గేమ్ ఆడిన సొహైల్
బిగ్బాస్ హౌస్లో గ్రాండ్ ఫినాలే రోజున ఎవరూ ఊహించని ట్విస్ట్ ఒకటి చోటుచేసుకుంది. టాప్-5 నుంచి హారిక, అరియానా వెళ్లిపోయిన తర్వాత హౌస్లో మిగిలిన అభిజీత్, అఖిల్, సొహైల్కు నాగార్జున ఓ ఆఫర్ ఇచ్చారు. ఎవరైతే స్వచ్ఛందంగా బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వస్తారో వారికి రూ.25 లక్షలు ఇస్తానని ప్రకటించారు. నాగార్జున ఇచ్చిన ఆఫర్కు సోహైల్ ఓకే చెప్పాడు. అందులో రూ.5 లక్షలు మెహబూబ్కు, రూ.10 లక్షలను అనాథ శరణాలయానికి ఇస్తానని చెప్పాడు. దీంతో వెంటనే స్పందించిన మెహబూబ్ తనకిస్తానన్న రూ.5 లక్షలు కూడా అనాథ శరణాలయానికి ఇస్తానని ప్రకటించాడు. దీంతో నాగార్జున ఇంకో ఆఫర్ ఇచ్చాడు. అనాథ శరణాలయానికి రూ.10 లక్షలు తన సొంత డబ్బులు ఇస్తానని చెప్పడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అంతకుముందు అరియానాకు రూ.10లక్షలు ఆఫర్ చేసినా ఆమె తిరస్కరించింది. చివరి వరకూ పోటీలో ఉండేందుకే మొగ్గు చూపింది. గత మూడు సీజన్ల ఫినాలేలో ఇలాంటి ఆపర్ ఇచ్చినా ఎవరూ తీసుకునేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. మరోవైపు మెహబూబ్ రూ.5లక్షలు అనాథ శరణాలయానికి ఇస్తాడని నాగార్జున.. చిరంజీవికి చెప్పడంతో స్పందించిన చిరంజీవి వెంటనే మెహబూబ్కు రూ.10 లక్షల చెక్కును వేదికపైనే అందించారు.
బిగ్బాస్ సీజన్-4 హైలైట్స్
* సెప్టెంబరు 6న మొదలైన ‘బిగ్బాస్ సీజన్-4’ 105 రోజుల పాటు నిర్విరామంగా సాగింది.
* కరోనా నేపథ్యంలో ఈసారి హౌస్లోకి వెళ్లేవారి కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరినీ కరోనా టెస్టు చేసి, క్వారంటైన్ తర్వాతే హౌస్లోకి పంపారు.
* సూర్య కిరణ్, కల్యాణి, దేవి, స్వాతి, గంగవ్వ, సుజాత, దివి, నోయల్, అమ్మా రాజశేఖర్, మెహబూబ్, లాస్య, అవినాష్, మోనల్, హారిక, అరియానా, సోహైల్, అఖిల్, అభిజీత్ మొత్తం 19మంది కంటెస్టెంట్లు ఈ సీజన్లో పాల్గొన్నారు.
* వీరిలో కుమార్ సాయి, అవినాశ్, స్వాతి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి వెళ్లారు.
* గంగవ్వ, నోయల్లు అనారోగ్యం కారణంగా సీజన్ మధ్యలోనే హౌస్ విడిచి వెళ్లిపోయారు.
* దసరా పండుగ సందర్భంగా సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
* 62వ రోజున తమిళ బిగ్బాస్ హౌస్ మేట్స్తో పాటు, వ్యాఖ్యాత కమల్ హాసన్ తెలుగు బిగ్బాస్ షోలోని వారితో వర్చువల్గా మాట్లాడారు.
* 100వ రోజు స్పెషల్గా హరితేజ (సీజన్-1), గీతా మాధురి (సీజన్-2), శ్రీముఖి (సీజన్-3) అలీ రెజా (సీజన్-3)లో పాల్గొన్న వారితో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..