CASH: సీరియల్స్‌లో కన్నీళ్లు.. కారణమదే

స్టార్‌ యాంకర్‌ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ గేమ్‌ షో ‘క్యాష్‌.. దొరికినంత దోచుకో’. ఎంతో సరదాగా సాగే ఈ గేమ్‌ షోలో తాజాగా బుల్లితెర తారలు తేజస్వినీ, మోనీషా, సుహాసిని, వైష్ణవి సందడి చేశారు....

Published : 05 Jul 2021 15:30 IST

హైదరాబాద్‌: స్టార్‌ యాంకర్‌ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ గేమ్‌ షో ‘క్యాష్‌.. దొరికినంత దోచుకో’. ఎంతో సరదాగా సాగే ఈ గేమ్‌ షోలో తాజాగా బుల్లితెర తారలు తేజస్విని, మోనీషా, సుహాసిని, వైష్ణవి సందడి చేశారు. తమ కెరీర్‌ గురించి సుమతో ఎన్నో విశేషాలు పంచుకున్నారు. అలాగే తమ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని రహస్యాలను బయటపెట్టారు. తాను ఇప్పటివరకూ ఏ సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోలేనని త్వరలోనే అడుగుపెడుతున్నానని నటి సుహాసిని తెలిపారు. అనంతరం.. కథలో హీరోయిన్స్ ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా ఉంటే.. అలాంటి సీరియల్స్‌ని ప్రేక్షకులు ఎక్కువగా చూడడం లేదని.. హీరోయిన్స్‌ ఏడుస్తుంటేనే చూస్తున్నారని నటి సుహాసిని సరదాగా చెప్పారు. షోలో భాగంగా సుహాసిని, మౌనీషాలపై సుమ వేసే పంచులు నవ్వులు పూయించేలా ఉన్నాయి. బుల్లితెర తారలతో సుమ చేసిన సరదా అల్లరి చూడాలనుకుంటే వచ్చే శనివారం వరకూ వేచి చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని