chiranjeevi: చిరంజీవితో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ

అగ్ర కథానాయకుడు చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మర్యాదపూర్వకరంగా కలిశారు.

Published : 06 Mar 2022 01:30 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మర్యాదపూర్వకరంగా కలిశారు. శనివారం చిరంజీవి నివాసానికి వెళ్లిన కిషన్‌రెడ్డి ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. ఏప్రిల్‌లో నిర్వహించే అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు దక్కిన గౌరవమని ఈ సందర్భంగా చిరంజీవి అన్నారు. జానపద, గిరిజన కళలు, సంగీతం, వివిధ రాష్ట్రాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి ఇలాంటి ఉన్నతమైన వేదికలు అవసరమైన చిరు అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని