Chiranjeevi: నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అది: చిరంజీవి స్పెషల్ పోస్ట్
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) తాజాగా షేర్ చేసిన ఓ పోస్ట్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. తన కెరీర్లోని టర్నింగ్ పాయింట్ అదేనంటూ ఆయన తెలిపారు.
హైదరాబాద్: అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) కెరీర్లోని బ్లాక్బస్టర్ చిత్రాల్లో ‘ఖైదీ’ (Khaidi) ఒకటి. 1983లో విడుదలైన ఈ చిత్రం చిరంజీవిని స్టార్ హీరో చేసింది. ‘ఖైదీ’ విడుదలై ఈ ఏడాదితో 40 ఏళ్లు అవుతోన్న సందర్భంగా చిరంజీవి ఆసక్తికర పోస్ట్ పెట్టారు. చిత్రబృందానికి, తెలుగు సినీ ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.
‘‘ఖైదీ’.. నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఇది విడుదలై నేటికి 40 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆ సినిమా జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్, రచయితలు పరుచూరి సోదరులు, నా కో-స్టార్స్ సుమలత, మాధవీతోపాటు టీమ్ మొత్తాన్ని అభినందిస్తున్నా. గొప్ప విజయాన్ని మాకు అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు’’ అని చిరంజీవి తెలిపారు.
Pawan kalyan: భార్యతో కలిసి ఇటలీ బయల్దేరిన పవన్ కల్యాణ్.. ఫొటోలు వైరల్
1982లో విడుదలైన ‘ఫస్ట్ బ్లడ్’ అనే హాలీవుడ్ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని కోదండరామిరెడ్డి ‘ఖైదీ’ని తీర్చిదిద్దారు. పూర్తి స్థాయి యాక్షన్ కథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇందులోని పాటలు ఎవర్గ్రీన్. మొత్తం ఐదు పాటలు ఉండగా, అన్నింటినీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల పాడటం విశేషం. ముఖ్యంగా ‘గోరింటా పూసింది’, ‘ఇదేమిటబ్బా..’ పాటలు క్లాస్ను విశేషంగా అలరించగా, ‘రగులుతోంది మొగలి పొద’ (Raguluthondi Mogali Poda) మాస్ జనాన్ని ఓ ఊపు ఊపేసింది. థియేటర్స్లో ‘వన్స్మోర్..’ అనిపించుకున్న పాటల్లో ఇదీ ఒకటి. ఇందులో మాధవి, చిరంజీవిల నాగినీ డ్యాన్స్ యువతను కట్టిపడేసింది. ఈ పాటకు సలీమ్ మాస్టర్ నృత్యాలను సమకూర్చగా, సహాయకుడిగా ఉన్న శివ శంకర్ మాస్టర్ దగ్గరుండి చిరంజీవికి సూచనలు చేశారు. ఇక ప్రముఖ నృత్య దర్శకుడు హీరాలాల్ కూడా ఈ పాటకు కొన్ని సూచనలు చేయడం గమనార్హం.
ఈ సినిమాను షూటింగ్కు 40 రోజుల సమయం పట్టింది. అక్టోబరు 28, 1983లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.8కోట్లు కలెక్ట్ చేసింది. ‘ఖైదీ’ని అదే పేరుతో హిందీ, కన్నడలోనూ దీనిని రీమేక్ చేశారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగింది. ‘ఖైదీ’ పేరు కలిసొచ్చేలా చిరంజీవి ‘ఖైదీ నెం.786’, ‘ఖైదీ నంబర్ 150’ చిత్రాలను చేశారు. ఈ రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. ఇక, ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న చిత్రాల విషయానికి వస్తే.. ‘భోళాశంకర్’ తర్వాత ఆయన వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కించారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవల జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శిఖర్ పహాడియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియాతో తన బంధం గురించి జాన్వీ మొదటిసారి స్పందించారు. -
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ భూ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై టీమ్ స్పందించింది. -
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ల సినిమా టైటిల్ ఇదేనా!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
ప్రభాస్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే.. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. -
నా అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
Renu Desai: రూ.3500 కావాలంటూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్కు గాయమైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
తనను ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ అనడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు నటి శివానీ రాజశేఖర్. -
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ షూటింగ్ అనుభవాలను జాన్వీ కపూర్ పంచుకున్నారు. -
అసలైన విజయమంటే అదే.. బర్త్డే రోజు రామ్ ఆసక్తికర పోస్ట్
మనకు నచ్చింది చేయగలగడమే అసలైన విజయమని రామ్ పోతినేని అన్నారు. -
ఇలా చేయడం సరికాదు: ‘సెపరేషన్’ పోస్ట్ ట్రోల్స్పై జీవీ ప్రకాశ్
తనపై కొందరు ట్రోల్స్ చేయడం బాధగా ఉందని సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ పేర్కొన్నారు. -
విమర్శలు వచ్చినా.. ‘యానిమల్’ హిట్కు కారణమిదే: మనోజ్ బాజ్పాయ్
సినిమాలు చూడాలా, లేదా అనే విషయంలో ప్రేక్షకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ అన్నారు. -
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
తనపై తప్పుడు వార్తలు ప్రచురించడంపై నటి మెహరీన్ అసహనం వ్యక్తం చేశారు. -
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
పారితోషికం విషయంలో హీరోయిన్లు పోరాటం చేస్తున్నారని నటి సోనాక్షి సిన్హా అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
ఉదయం 11 గంటలకు తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
-
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM