Dhanush: సమాజంలోని అసమానతల కథే ‘ధనుష్‌ 51’

ధనుష్‌ - శేఖర్‌ కమ్ముల కలయికలో ఓ పాన్‌ ఇండియా చిత్రం ‘ధనుష్‌ 51’గా పట్టాలెక్కనుంది. శుక్రవారం ధనుష్‌ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Updated : 28 Jul 2023 14:12 IST

ధనుష్‌ - శేఖర్‌ కమ్ముల కలయికలో ఓ పాన్‌ ఇండియా చిత్రం ‘ధనుష్‌ 51’గా పట్టాలెక్కనుంది. శుక్రవారం ధనుష్‌ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఓ కాన్సెప్ట్‌ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. అందులో ఓవైపు ఖరీదైన భారీ ఆకాశహార్మ్యాలు.. మరోవైపు పేదరికాన్ని ప్రతిబింబించే మురికివాడ.. ఈ రెండింటికీ మధ్యలో పాత వంద రూపాయల నోట్ల కట్ట కనిపించాయి. దీన్ని బట్టి సమాజంలోని అసమానతల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనున్నట్లు అర్థమవుతోంది. ఇందులో ధనుష్‌ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇందులో కథానాయకుడు నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని