Dimple Hayathi: అప్పుడు నిరాశలోకి వెళ్లిపోయా
వెండితెరపై తెలుగమ్మాయిలు క్రమం తప్పకుండా మెరుస్తూనే ఉన్నారు. వాళ్లకి తగిన ప్రోత్సాహం దక్కాలంతే. ‘గద్దలకొండ గణేష్’ ప్రత్యేక గీతంలో డింపుల్ హయాతిని చూడగనే ‘ఈ అందం సూపర్హిట్టు’ అనేశారు ప్రేక్షకులు.త్వరలోనే రవితేజతో కలిసి ‘ఖిలాడి’లో సందడి చేయనుంది.
వెండితెరపై తెలుగమ్మాయిలు క్రమం తప్పకుండా మెరుస్తూనే ఉన్నారు. వాళ్లకి తగిన ప్రోత్సాహం దక్కాలంతే. ‘గద్దలకొండ గణేష్’ ప్రత్యేక గీతంలో డింపుల్ హయాతిని చూడగనే ‘ఈ అందం సూపర్హిట్టు’ అనేశారు ప్రేక్షకులు.త్వరలోనే రవితేజతో కలిసి ‘ఖిలాడి’లో సందడి చేయనుంది. గోపీచంద్ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా డింపుల్ హయాతితో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆమె చెప్పిన విషయాలివీ...
‘గద్దలకొండ గణేష్’ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఎందుకింత విరామం?
సరైన సినిమా కోసం ఎదురు చూశా. చిత్ర పరిశ్రమలో మనం వేసే ప్రతీ అడుగూ పక్కాగా ఉండాల్సిందే కదా. ‘గద్దలకొండ గణేష్’లోని సూపర్హిట్టు పాట తర్వాత అన్నీ అలాంటి అవకాశాలే వచ్చాయి. నేను కలలుగన్న హీరోలతో తెరని పంచుకునే అవకాశం వచ్చినా కాదనుకుంటున్నానే అని బాధగా అనిపించేది. కానీ నేను డ్యాన్సే కాదు, నటించగలననీ నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక గీతాలు చేయనని చెప్పా. అలాగని ప్రత్యేక గీతాలు ఇకపై చేయనని కాదు, కావాలంటే ఎప్పుడైనా చేయొచ్చు. కథానాయికగా సరైన సినిమా చేయాలనే ‘ఖిలాడి’ వరకు ఎదురు చూశా.
‘ఖిలాడి’లో అవకాశం ఎలా వచ్చింది?
రమేష్ వర్మ నా ఫొటోలు చూశారు. కథ చెప్పాక, ఒక వారంలో లుక్ టెస్ట్ అన్నారు. రవితేజ, నేను, మీనాక్షి చౌదరిలని కలిపి లుక్ టెస్ట్ చేశారు. లుక్ టెస్ట్ అనేది నా కెరీర్లో తొలిసారి. తర్వాత నన్ను ఎంపికచేశారు. రవితేజ నన్ను ఎంతో ప్రోత్సహించారు.
ఇందులో పాత్ర ఎలా ఉంటుంది?
పక్కింటి అమ్మాయిగానూ, గ్లామరస్గా కనిపించే ట్రెండీ అమ్మాయిగానూ రెండు రకాలుగా కనిపించే పూర్తిస్థాయి పాత్ర నాది. నటిగా నాకు సంతృప్తినిచ్చిన పాత్ర ఇది. నట ప్రయాణం గురించి ఎలాంటి కలలు కన్నానో... అలాంటి పాత్రనే చేశా. చిత్రీకరణ చాలా తృప్తినిచ్చింది. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. విశాల్తో కలిసి చేసిన ‘సామాన్యుడు’లోనూ పూర్తిస్థాయి కథా నాయికగా నటించా. ఈరెండు సినిమాలూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. హిందీలో ‘అత్రంగీ రే’ చిత్రంలో చిన్న పాత్ర చేశా. అదీ మంచి గుర్తింపు తెచ్చింది.
ఒక తెలుగు కథానాయికగా ఎలాంటి ప్రోత్సాహం లభిస్తోంది?
ఇప్పటివరకైతే పరిశ్రమ స్పందన సానుకూలంగానే ఉంది. చాలామందికి ఎదురైనట్టుగానే కొన్ని మంచి, చెడు అనుభవాల తర్వాత ఇక్కడి వరకు వచ్చా. కొంచెం నలుపు రంగు చర్మంతో కనిపించే అమ్మాయిని. పరిశ్రమలో తెల్లటి రంగుకీ, అందానికే ఎక్కువ ప్రాధాన్యం. ఇప్పుడు ఆ కోణం మారుతోంది. ప్రతిభకి తగ్గ ప్రాధాన్యం దక్కుతోంది. అదొక మంచి పరిణామం.
మీ రంగు విషయంపై మీకెప్పుడైనా అవమానాలు ఎదురయ్యాయా?
‘గద్దలకొండ గణేష్’కి ముందు చాలా సినిమా కార్యాలయాలకి వెళ్లాను. ఎన్నిసార్లు తిరస్కారాలు ఎదురయ్యేవో లెక్కేలేదు. నాతో అనేవాళ్లు కాదు కానీ, నేను వెళ్లాక నలుపుగా ఉంది, ఫెయిర్ స్కిన్ ఉన్న అమ్మాయి కావాలనేవాళ్లు. అప్పుడు కొంచెం బాధగా అనిపించేది. తీవ్ర నిరాశతో ఉన్న సమయంలో ‘గద్దలకొండ గణేష్’లో పాట చేశా. కెరీర్కి ప్లస్ పాయింట్ అది.
తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు ‘గద్దలకొండ గణేష్’ చేశా అన్నారు. అంతకు ముందు ఏం జరిగింది?
ఓ అగ్ర దర్శకుడితో పెద్ద సినిమా చేశా. అందులో ప్రధాన కథానాయికని నేను. 90 శాతం చిత్రీకరణ అయ్యాక అది ఆగిపోయింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే ‘గద్దలకొండ గణేష్’లో ప్రధాన కథానాయిక పాత్ర కోసం నన్ను ఆడిషన్ చేశారు దర్శకుడు హరీష్శంకర్. అప్పటికే ఆ పెద్ద సినిమా చేస్తుండడంతో ‘గద్దలకొండ గణేష్’కి కాల్షీట్లు కేటాయించలేకపోయా. కానీ అంతలోనే చేస్తున్న సినిమా ఆగిపోవడంతో నేను తీవ్ర నిరాశకి గురయ్యా. అది హరీష్శంకర్కి తెలియడంతో ‘గద్దలకొండ గణేష్’లో ప్రత్యేక గీతం చేయమని చెప్పారు. ఆయన్ని నమ్మి చేశా. అది నా కెరీర్ని మలుపు తిప్పింది.
‘‘మా ఇంట్లో ప్రతి ఒక్కరూ నటులే, ప్రతి ఒక్కరూ నృత్యకారులే. విజయవాడలో పుట్టా, హైదరాబాద్లో పెరిగా. అంతకుమించి నా కుటుంబ నేపథ్యం గురించి చెప్పను. నా స్వశక్తితోనే వచ్చాను, నా గుర్తింపునే నేను స్వీకరిస్తాను. నా అసలు పేరు డింపుల్. మరీ చిన్నగా ఉందని, సంఖ్యాశాస్త్రం ప్రకారం హయాతి అని అదనంగా జోడించా. చిన్నప్పుడే నేను హీరోయిన్ని అని చెప్పుకొనేదాన్ని. నాకు సినిమా అంటే అంత పిచ్చి. పదహారో ఏట ‘గల్ఫ్’ చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టా. కథానాయిక ఓ తెలుగమ్మాయి అనగానే ఇంతవరకే చేయగలదని, ఆమెని ఇలాగే చూడగలం అని ముందే కొన్ని హద్దులు గీస్తుంటారు. వాటిని చెరిపేయడమే లక్ష్యంగా ప్రయాణం చేస్తున్నా. నా ఆలోచనలు ఆధునికంగా ఉంటాయి’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM