Kaathuvaakula Rendu Kaadhal: దరువేసిన డిప్పం డప్పం..

విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కణ్మణి రాంబో ఖతిజా’. సమంత, నయనతార కథానాయికలు. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్‌ 28న విడుదల ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను

Updated : 21 Apr 2022 10:45 IST

విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కణ్మణి రాంబో ఖతిజా’. సమంత, నయనతార కథానాయికలు. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్‌ 28న విడుదల ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రబృందం లిరికల్‌ వీడియోను విడుదల చేసింది. ‘డిప్పం డప్పం..’ అని హుషారుగా సాగే ఈ తమిళ పాటకు సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఇచ్చిన బీట్‌ అదిరిపోయింది. ఇద్దరమ్మాయిలను ఏకకాలంలో ప్రేమిస్తూ ఇబ్బందులు పడే పాత్రలో విజయ్‌ సేతుపతి నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని చిత్రబృందం తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని