Samantha: ఆ సినిమా కథకు, సమంత లైఫ్కు సంబంధం లేదు: డైరెక్టర్ శివ నిర్వాణ
విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘ఖుషి’. ఈ సినిమాకి సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా శివ మీడియాతో మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: తాను రాసిన ‘ఖుషి’ (Kushi) సినిమా కథకు, సమంత (Samantha) జీవితానికి ఎలాంటి సంబంధం లేదని దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) తెలిపారు. మూడేళ్ల క్రితమే ఆ స్టోరీ రాశానని చెప్పారు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత జంటగా ఆయన తెరకెక్కించిన చిత్రమిది. సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శివ హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు. సినిమా గురించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..
అదేంటో థియేటర్లలోనే తెలుస్తుంది..!
‘‘పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత ఎదురయ్యే సమస్యలతో గతంలో పలు సినిమాలు వచ్చాయి. అయితే, ఈ సినిమాలో టైటిల్కు తగినట్లుగా వినోదాత్మకంగా కథను చెప్పాలని అనుకున్నా. ‘డియర్ కామ్రేడ్’ సినిమా విడుదల తర్వాత విజయ్కి ఈ కథ చెప్పా. ఆ తర్వాత, ఏడాదిన్నరకు సినిమాని సెట్స్పైకి తీసుకెళ్లాం. ‘ఖుషి’.. మణిరత్నం ‘సఖి’ సినిమా తరహాలో సాగుతుందనే వార్తలు ఇటీవల వచ్చాయి. కానీ, ఇందులో ఓ యూనిక్ పాయింట్ ఉంటుంది. ప్రస్తుత సమాజంలో నెలకొన్న ఓ సమస్యని విజయ్, సమంతలాంటి స్టార్స్తో ప్రస్తావిస్తే బాగుంటుందనుకున్నా. వారికీ ఈ పాయింట్ కనెక్ట్ అయ్యింది. దాన్ని ట్రైలర్లో చూపించలేదు. థియేటర్లలోనే చూసి తెలుసుకోవాలి’’
సర్ప్రైజ్లు ఇవ్వనున్న అల్లు అర్జున్, విజయ్.. ఆసక్తి రేకెత్తించేలా పోస్ట్లు
అందుకే కశ్మీర్ బ్యాక్డ్రాప్
‘‘నేను గతంలో తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీ చిత్రాల్లో ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ చూపించా. ఖుషి వాటికి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాకి ముందుగా ‘సరదా’ సహా మరికొన్ని టైటిల్స్ అనుకున్నా. కానీ, విజయ్, సమంతకు ఉన్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని, అన్ని భాషల్లో ఒకే పేరు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో చివరకు ‘ఖుషి’ని ఖరారు చేశాం. ప్రేమ కథను కొత్తగా చెప్పాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే కశ్మీర్ బ్యాక్ డ్రాప్. ఫస్టాఫ్లో కనిపించే ప్రేమకథను కాలేజీలో చూపించకుండా ఓ ఆహ్లాదరక వాతావరణంలో చిత్రీకరిస్తే బాగుంటుని అనిపించింది. సమంత డెడికేషన్ ఉన్న నటి. అలాంటి ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోతే మేమంతా సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటాం? ట్రీట్మెంట్ మధ్యలో వచ్చి నటిస్తానని చెప్పేదిగానీ పూర్తిగా నయమైన తర్వాతే రమ్మని చెప్పాం’’
సమంతను ఎంపిక చేయడానికి కారణమదే..
‘‘కొందరు అనుకుంటున్నట్లు ‘ఖుషి’ సినిమా కథకు సమంత వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. ‘మజిలీ’ సినిమా కోసం ఆమెతో కలిసి పనిచేశా కాబట్టి ‘ఖుషి’లోని పాత్రకు న్యాయం చేయగలదనే నమ్మకంతో ఎంపిక చేశా. నేను రాసిన కథలో ఆమె తన క్యారెక్టర్ ప్లే చేసిందంతే. మరో హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తే ఇలాంటి ప్రశ్నలకు అవకాశం ఉండేది కాదు. ఇందులో హిందూ- ముస్లిం మధ్య గొడవలు చూపించట్లేదు. ఓ సున్నితమైన అంశాన్ని చర్చించాం’’
అలానే తెరకెక్కించాలని అనుకోను!
‘‘నేను దర్శకుడు మణిరత్నం అభిమానిని. ఆయన సినిమాలను బాగా ఇష్టపడతా. కానీ, అలానే తెరకెక్కించాలని అనుకోను. నా కెరీర్ ప్రారంభంలో చెన్నై వెళ్లి ఆయన దగ్గర పని చేయాలనుకున్నా. వారంపాటు ప్రయత్నించినా ఆయన్ను కలవడం కుదరలేదు. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ-2 వంటి సినిమాలను ఆయా దర్శకులు తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించినవే. అవి ఇతర భాషల వారికీ నచ్చాయి. మన నేటివిటీకి తగ్గట్లు సినిమాని బాగా తెరకెక్కిస్తే అది ఇతర చిత్ర పరిశ్రమల వారికీ నచ్చి పాన్ ఇండియా మూవీ అవుతుందనేది నా అభిప్రాయం’’ అని శివ నిర్వాణ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య ఇప్పుడు ‘లవ్ మీ’తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో ఎదురైన ప్రశ్నలపై ఆమె స్పందించారు. -
అందుకే ‘జనతా గ్యారేజ్’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
-
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
-
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం