Tollywood: సినిమా షూటింగ్లపై కీలకనిర్ణయం
కరోనా మహమ్మారి దెబ్బకు సినిమాల చిత్రీకరణలు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండటంతో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గురువారం సమావేశమైంది. షూటింగ్లపై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తుది దశలో ఉన్న సినిమా చిత్రీకరణలు పూర్తి చేయాలని ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి దెబ్బకు సినిమాల చిత్రీకరణలు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండటంతో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గురువారం సమావేశమైంది. షూటింగ్లపై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తుది దశలో ఉన్న సినిమా చిత్రీకరణలు పూర్తి చేయాలని ప్రకటించింది. ఆ తర్వాతే కొత్త సినిమాల షూటింగ్లు ప్రారంభించాలని సూచించింది. షూటింగ్స్కు హాజరయ్యే నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సభ్యుల నుంచి నిర్మాణ సంస్థలు కరోనా టీకా తీసుకున్నట్లు నిర్ధారించాకే అనుమతి ఇవ్వాలని సూచించింది. ఒక్కడోసు వేసుకున్నవారిని కూడా షూటింగ్లోకి అనుమతించాలని తీర్మానించారు. ఆగిపోయిన సినిమాలకు సంబంధించి దర్శకులు తమ షెడ్యుల్ను కుదించుకొని వీలైనంత తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేసేలా చూడాలని నిర్ణయించింది. షూటింగ్ సమయంలో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని చెప్పింది.
మొదలుపెట్టేది మామా అల్లుళ్లేనా?!
చిత్రీకరణలు షురూ అయ్యాయి. ఇప్పుడందరి దృష్టి థియేటర్లపైనే. రెండో దశ కరోనా తగ్గుముఖం పట్టగానే చిత్రీకరణల కోసం ధైర్యంగా రంగంలోకి దిగినట్టుగానే... థియేటర్లు తెరుచుకున్న వెంటనే సినిమాల్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కరోనాపై అవగాహన పెరగడంతోపాటు..వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది కాబట్టి ప్రేక్షకులు ఇదివరకటి కంటే ధైర్యంగా వస్తారని పరిశ్రమ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. తొలి దశ కరోనా తర్వాత ప్రేక్షకులు వస్తారో లేదో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ మంచి సినిమాలు విడుదలైన వెంటనే ప్రేక్షకులు థియేటర్లకి వచ్చారు. ఇప్పుడూ అదే తరహా స్పందన లభిస్తుందనేది నిర్మాతల నమ్మకం. యాభై శాతం ప్రేక్షకులతో అనుమతులు లభించినా ఈసారి బాక్సాఫీసు ముందుకు సినిమాలు వరుస కట్టే అవకాశాలున్నాయి. వచ్చే నెలలోనే తెరపై బొమ్మ పడొచ్చని, అగ్ర తారలు నటించిన భారీ బడ్జెట్ చిత్రాలేమో వంద శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు మొదలైనప్పుడే విడుదల కావొచ్చని వ్యాపార వర్గాల అంచనా వేస్తున్నాయి.
విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమాల జాబితా పెద్దదే. ‘టక్ జగదీష్’, ‘లవ్స్టోరి’, ‘విరాటపర్వం’ తదితర చిత్రాలు రెండో దశ కరోనా వల్ల విడుదల ముంగిట ఆగిపోవల్సి వచ్చింది. ఆ సినిమాలన్నీ ఇప్పుడు థియేటర్ల ముందుకు వరుస కట్టనున్నాయి. లాక్డౌన్ తొలగించిన వెంటనే మా సినిమాని విడుదల చేస్తామని ‘లవ్స్టోరి’ నిర్మాతలు చెబుతున్నారు. యాభై శాతం ప్రేక్షకులతో అనుమతులు లభించినా తమ సినిమాల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న నిర్మాతలు చాలామందే ఉన్నారు. విడుదల కావల్సిన సినిమాల జాబితా ఎక్కువగా ఉండటం...ఆలస్యం చేస్తే పోటీ ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో నిర్మాతలు తమ చిత్రాల్ని వీలైనంత త్వరగా విడుదల చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన ‘దృశ్యం2’, ‘నారప్ప’ సినిమాలు ఇప్పటికే విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. మరో వారం రోజుల్లో ‘నారప్ప’ తొలి కాపీ సిద్ధం కానుందని ఆ సినిమా వర్గాలు ఇటీవలే వెల్లడించాయి. పరిస్థితులు చూస్తుంటే ఈసారి మామా అల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య కథా నాయకులుగా నటించిన ‘నారప్ప’, ‘లవ్స్టోరి’ సినిమాలతోనే బాక్సాఫీసు దగ్గర సందడి షురూ కావొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. జులై ఆఖరు, ఆగస్టు ఆరంభంలో ఆ సినిమాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. గతేడాది ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో థియేటర్ల దగ్గర సందడి మొదలైంది. సంక్రాంతికి విడుదలైన సినిమాలతో సినీ వ్యాపారం గాడిన పడింది. ‘ఉప్పెన’, ‘జాతిరత్నాలు’, ‘వకీల్సాబ్’లు ఓవర్సీస్లోనూ తెలుగు సినిమా పుంజుకున్న వైనం గురించి మాట్లాడుకునేలా చేశాయి. ఈసారి మరింత వేగంగా సినీ పరిశ్రమ గాడిన పడొచ్చనే ఆశాభావం పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట