ఆమెకు వచ్చింది జ్వరం మాత్రమే...!

దర్శకురాలు సంజనా రెడ్డికి వచ్చింది కేవలం వైరల్‌ ఫీవర్‌ మాత్రమేనని నిర్మాత కోన వెంకట్‌ తెలిపారు. ఇటీవల అనారోగ్యానికి గురైన సంజనా రెడ్డిని సోమవారం కుటుంబసభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో...

Updated : 10 Jun 2020 11:17 IST

మీ ఊహాగానాలకు చెక్‌ పెట్టండి: కోన వెంకట్‌

హైదరాబాద్‌: దర్శకురాలు సంజనా రెడ్డికి వచ్చింది కేవలం వైరల్‌ ఫీవర్‌ మాత్రమేనని నిర్మాత కోన వెంకట్‌ తెలిపారు. ఇటీవల అనారోగ్యానికి గురైన సంజనా రెడ్డిని సోమవారం కుటుంబసభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో ఆమె ఆరోగ్యంపై సోషల్‌మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. సంజనారెడ్డి ఆరోగ్యం విషమంగా ఉందని, ఆమెను ఐసీయూలో ఉంచారని పేర్కొంటూ నెట్టింట్లో పోస్టులు దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో కోన వెంకట్‌ ఆమె ఆరోగ్యంపై ట్విటర్‌ వేదికగా స్పందించారు.

‘మన ‘కరణం మల్లేశ్వరి’ బయోపిక్‌ డైరెక్టర్‌ సంజనా రెడ్డి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. ఆమె త్వరలోనే కోలుకుని ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చేస్తారు. వైరల్‌ ఫీవర్‌ చికిత్స కోసమే ఆమె ఆస్పత్రిలో చేరారు. దయచేసి మీ ఊహాగానాలకు ఇకనైనా చెక్‌ పెట్టండి.’ అని కోన వెంకట్‌ ట్వీట్‌ చేశారు.

ఒలింపిక్‌ పతకం పొందిన తొలి భారతీయ మహిళగా కరణం మల్లేశ్వరి అందరికీ సుపరిచితురాలు. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కనున్న చిత్రానికి సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకంపై కోన వెంకట్‌ నిర్మించనున్నారు. ఇటీవల కరణం మల్లేశ్వరి పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని