10 తర్వాత సమాధానం చెబుతా
‘మా’ ఎన్నికల తర్వాత పవన్కల్యాణ్ అడిగిన ప్రతి మాటకీ సమాధానం చెబుతానని ఓ లేఖ ద్వారా స్పష్టం చేశారు సీనియర్ నటుడు మోహన్బాబు. ‘రిపబ్లిక్’ సినిమా వేడుకలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై
‘మా’ ఎన్నికల తర్వాత పవన్కల్యాణ్ అడిగిన ప్రతి మాటకీ సమాధానం చెబుతానని ఓ లేఖ ద్వారా స్పష్టం చేశారు సీనియర్ నటుడు మోహన్బాబు. ‘రిపబ్లిక్’ సినిమా వేడుకలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలంటూ మోహన్బాబుని ఉద్దేశించి ప్రముఖ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై మోహన్బాబు ఆదివారం ఓ లేఖ ద్వారా స్పందించారు. ‘‘నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్కల్యాణ్ నువ్వు నా కంటే చిన్నవాడివి. అందుకని ఏకవచనంతో సంభోదించాను. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే. ఇప్పుడు మా ఎన్నికలు జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబరు 10న ఎన్నికలు పూర్తవుతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకీ నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతా. ఈలోగా నువ్వుచేయవల్సిన ముఖ్యమైన పని... నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్కి వేసి గెలిపించాలని కోరుకుంటున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు మోహన్బాబు.
యువ కథానాయకుల మద్దతు
పవన్కల్యాణ్ వ్యాఖ్యలపై యువ కథానాయకులు నాని, కార్తికేయ స్పందించారు. నిజాయతీగా చిత్రసీమ సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాలని కోరారు. నాని ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ‘‘పవన్కల్యాణ్ సర్కీ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్యనున్న రాజకీయ విభేదాలని పక్కనపెడదాం. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని నిజాయతీగా ప్రస్తావించినందుకు పవన్కల్యాణ్కు కృతజ్ఞతలు. సినీ పరిశ్రమ పునరజ్జీవన విషయంలో ఆలస్యం కాకుండా తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంద’’న్నారు. మరో యువ కథానాయకుడు కార్తికేయ ట్వీట్ చేశారు. ‘‘నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడమో లేక, వ్యతిరేకించడమో లేదు. తెలుగు సినిమా పరిశ్రమకి సంబంధించి పవన్కల్యాణ్ ప్రస్తావించిన సమస్యలు పూర్తిగా వాస్తవం. మా అందరి తరఫున మాట్లాడిన పవన్ సార్కి మద్దతు ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నా’’ అని తెలిపారు.
అవి వ్యక్తిగత అభిప్రాయాలే
సినీ పరిశ్రమకి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు అవసరమని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి స్పష్టం చేసింది. వివిధ వ్యక్తులు వెలిబుచ్చిన అభిప్రాయాలు వాళ్ల వ్యక్తిగతమే తప్ప, వాటితో చిత్ర పరిశ్రమకి సంబంధం లేదని స్పష్టం చేసింది. చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు నారాయణ్దాస్ నారంగ్ పేరిట ఆదివారం ఓ లేఖని విడుదల చేసింది మండలి. ‘‘ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని ఆహ్వానం మేరకు ఇదివరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రతినిధులు సమావేశమై పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ఆందోళనల్ని తెలిపాం. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి అర్థం చేసుకుని, మా ఆందోళనలకి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. ఏళ్లుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్నాయి. వారి మద్దతు లేకుండా చిత్ర పరిశ్రమ మనుగడ సాధించలేదు. నాయకులు, ప్రభుత్వాలు నిరంతర మద్దతు అందించడం చిత్ర పరిశ్రమకి ఎంతో అవసరం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా